NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Air Pollution: ఢిల్లీలో తీవ్రంగానే గాలి కాలుష్యం ..నగరాన్నికమ్మేసిన దట్టమైన పొగలు 
    తదుపరి వార్తా కథనం
    Air Pollution: ఢిల్లీలో తీవ్రంగానే గాలి కాలుష్యం ..నగరాన్నికమ్మేసిన దట్టమైన పొగలు 
    ఢిల్లీలో తీవ్రంగానే గాలి కాలుష్యం ..నగరాన్నికమ్మేసిన దట్టమైన పొగలు

    Air Pollution: ఢిల్లీలో తీవ్రంగానే గాలి కాలుష్యం ..నగరాన్నికమ్మేసిన దట్టమైన పొగలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 11, 2024
    12:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రంగా కొనసాగుతోంది. గత పది రోజుల నుంచి రాజధాని ప్రాంతంలో కాలుష్యం అత్యంత తీవ్రమైన స్థాయిలో ఉంది.

    సోమవారం ఉదయం కూడా గాలి నాణ్యత సూచి అధ్వానంగా నమోదైంది. అలాగే నగరాన్ని పొగమంచు పూర్తిగా ఆవహించింది.

    కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం, ఉదయం 9 గంటలకు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (Air Quality Index) 349గా నమోదైంది.

    రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 400 (తీవ్రమైన స్థాయి)కి పైనే నమోదైంది.

    వివరాలు 

    మోడరేట్‌ కేటగిరీలో ముంబై

    బవానాలో ఏక్యూఐ 401, జహంగీర్‌పురిలో 412, ఆనంద్‌ విహార్‌లో 378, అశోక్‌ విహార్‌లో 379, ద్వారకా సెక్టార్‌ 8లో 356, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాంతంలో 336, ముంద్కా ప్రాంతంలో 379, ద్వారకాలో 379, పంజాబీ బాగ్‌లో 385, ఆర్కే పురంలో 368, రోహిణిలో 383, వజీర్‌పూర్‌లో 391గా ఏక్యూఐ లెవల్స్‌ నమోదయ్యాయి.

    దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గాలి నాణ్యత సూచీ 140తో మోడరేట్‌ కేటగిరీలో నమోదైంది. ముంబై నగరాన్ని కూడా పొగ మంచు కమ్మేసింది.

    వివరాలు 

    కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు

    అయితే, సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 17.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

    దీంతో ఢిల్లీ నగరాన్ని తేలికపాటి పొగమంచు కమ్మేసింది. సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

    మరోవైపు కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆప్‌ ప్రభుత్వం ఆదివారం 'EV as a Service‌' కార్యక్రమాన్ని ప్రారంభించింది.

    ఎలక్ట్రిక్ వాహనాలను పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలుగా ప్రోత్సహిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    దిల్లీ

    Atishi: దిల్లీ సీఎంగా నేడు అతిషి ప్రమాణస్వీకారం అతిషి మార్లెనా
    Atishi: దిల్లీ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అతిషి అతిషి మార్లెనా
    Delhi: నవంబర్‌లో ఢిల్లీలో కృత్రిమ వర్షాలు.. సరి-బేసి తిరిగి వస్తుంది: పర్యావరణ మంత్రి భారతదేశం
    Air Quality: పంట వ్యర్థాలను కాల్చడం విషయంలో.. ఎయిర్‌ క్వాలిటీ కమిషన్‌పై సుప్రీం ఆగ్రహం సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025