NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Building Collapse: ఢిల్లీలోని ముస్తఫాబాద్ ఏరియాలో కుప్ప కూలిన భవనం.. నలుగురు మృతి..
    తదుపరి వార్తా కథనం
    Building Collapse: ఢిల్లీలోని ముస్తఫాబాద్ ఏరియాలో కుప్ప కూలిన భవనం.. నలుగురు మృతి..
    ఢిల్లీలోని ముస్తఫాబాద్ ఏరియాలో కుప్ప కూలిన భవనం.. నలుగురు మృతి..

    Building Collapse: ఢిల్లీలోని ముస్తఫాబాద్ ఏరియాలో కుప్ప కూలిన భవనం.. నలుగురు మృతి..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 19, 2025
    08:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

    అక్కడ ఉన్న ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

    ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను వేగవంతంగా ప్రారంభించారు.

    భవనం కూలే సమయంలో అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

    వివరాలు 

    సహాయక చర్యలు చేపట్టిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ బృందాలు

    ఈ ఘటనపై అదనపు పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ స్పందిస్తూ, శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని, నలుగురు చనిపోయారని, ఇద్దరు గాయపడినట్లు తెలిపారు.

    ఇక, డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర అత్వాల్ మాట్లాడుతూ, తెల్లవారుజామున 2.50 గంటల సమయంలో భవనం కూలిపోయిందన్న సమాచారం తమకు వచ్చిందని చెప్పారు.

    వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ బృందాలు కలిసి సహాయక చర్యలు చేపట్టాయని వివరించారు.

    కూలిన భవనంలో ప్రమాద సమయంలో నలుగురు మహిళలు ఉండారని గుర్తించారు.

    వారిలో ఒకరికి ముగ్గురు పిల్లలు, మరో మహిళకు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్నట్టు సమాచారం.

    అయితే, ప్రస్తుతం వీరెవ్వరూ కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కుప్ప కూలిన భవనం.. నలుగురు మృతి..

    #WATCH | Mustafabad building collapse | An eyewitness says, " Two men and two daughters-in-law stay here. The oldest daughter-in-law has three children, second daughter-in-law has three children...right now we don't know anything. They are nowhere to be seen" https://t.co/lXyDvOpZ3q pic.twitter.com/1dbstH6Vn3

    — ANI (@ANI) April 19, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    దిల్లీ

    Sheesh mahal: షీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం: రేఖా గుప్తా భారతదేశం
    Rekha Guptha: ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా భారతదేశం
    Bansuri Swaraj: బీజేపీ నేత బన్సూరి స్వరాజ్‌పై పరువు నష్టం కేసు.. కొట్టేసిన ఢిల్లీ కోర్టు  భారతదేశం
    #NewsBytesExplainer: ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేఖా గుప్తా ఎదుర్కోనున్న సవాళ్లు ఏమిటి? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025