NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mohanty: నదుల అనుసంధానంలో రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్లను తీర్చడం సాధ్యం కాదు: మహంతి
    తదుపరి వార్తా కథనం
    Mohanty: నదుల అనుసంధానంలో రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్లను తీర్చడం సాధ్యం కాదు: మహంతి
    నదుల అనుసంధానంలో రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్లను తీర్చడం సాధ్యం కాదు: మహంతి

    Mohanty: నదుల అనుసంధానంలో రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్లను తీర్చడం సాధ్యం కాదు: మహంతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 04, 2024
    11:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నదుల అనుసంధానంపై జరుగుతున్న చర్చలలో భాగంగా, రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించడం కష్టం అని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి మహంతి తెలిపారు.

    ప్రతి రాష్ట్రం తమకు అదనంగా నీటి వాటాలను కావాలనుకుంటే, వాటిని సరఫరా చేయడం ఎలా సాధ్యమవుతుందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

    జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) మంగళవారం దిల్లీ నుండి ఆన్‌లైన్ సమావేశం నిర్వహించింది.

    ఈ సమావేశంలో, మహంతి మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం వినియోగించని 148 టీఎంసీల నీటిని గోదావరి-కావేరి అనుసంధానంలో తరలించనున్నట్లు చెప్పారు.

    ఈ ప్రాజెక్టుకు సంబంధించి, రాష్ట్రాల డిమాండ్లను పరిశీలిస్తే, 400 టీఎంసీల నీటితో కూడా సరిపోవడం కష్టం అని ఆయన తెలిపారు.

    వివరాలు 

    రాష్ట్రాల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం 

    ఈ ప్రాజెక్టుకు సంబంధించి, రాష్ట్రాల్లో జరుగుతున్న అనుసంధాన పనులకు కేంద్రం మద్దతు అందిస్తుందని మహంతి తెలిపారు.

    అంతేకాకుండా, ఈ నెలాఖరున అన్ని రాష్ట్రాల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

    తెలంగాణ రాష్ట్రం తరఫున నీటిపారుదలశాఖ ఈఎన్సీ అనిల్ కుమార్, గోదావరి బేసిన్ డిప్యూటీ కమిషనర్ సుబ్రహ్మణ్య ప్రసాద్‌లు పాల్గొన్నారు.

    తెలంగాణ రాష్ట్రం గోదావరి నదీ ద్వారా 78 టీఎంసీల నీటిని అందించాలని, సమ్మక్కసాగర్, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులకు 152 టీఎంసీలను కేటాయించాలని కోరింది.

    ఇక, ఈ అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న రెండు రిజర్వాయర్లను నిర్మించాలని తెలంగాణ రాష్ట్రం విన్నవించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జల‌శక్తి శాఖ మంత్రి

    తాజా

    Iran: ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు క్షేమం.. రాయబార కార్యాలయం వెల్లడి  ఇరాన్
    AAP: తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతి.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు సమన్లు మనీష్ సిసోడియా
    Elon Musk: 'నన్ను క్షమించండి. నేను ఇంతకంటే భరించలేను'..ట్యాక్స్‌ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ గళం ఎలాన్ మస్క్
    Trump Traiffs:నేటి నుంచి స్టీల్,అల్యూమినియం దిగుమతులపై సుంకాలు 50%కి పెంపు .. ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం   డొనాల్డ్ ట్రంప్

    జల‌శక్తి శాఖ మంత్రి

    వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం నరేంద్ర మోదీ
    2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు  పోలవరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025