NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / డీజీసీఏ: ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్‌' విమానానికి రూ.10లక్షల జరిమానా
    తదుపరి వార్తా కథనం
    డీజీసీఏ: ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్‌' విమానానికి రూ.10లక్షల జరిమానా
    'గో ఫస్ట్‌' ఎయిర్‌లైన్‌కు రూ.10లక్షల జరిమానా విధించిన డీజీసీఏ

    డీజీసీఏ: ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్‌' విమానానికి రూ.10లక్షల జరిమానా

    వ్రాసిన వారు Stalin
    Jan 27, 2023
    06:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరు విమానాశ్రయంలో 55 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్‌' విమానానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.10 లక్షల జరిమానా విధించింది.

    జనవరి 9న, 55 మంది ప్రయాణికులు 'గో ఫస్ట్‌' విమానంలో దిల్లీకి వెళ్లేందుకు బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. బోర్డింగ్ పాస్‌, లగేజీని చెక్-ఇన్ అయ్యాక బస్సుల్లో విమానం దగ్గరికి వెళ్లగా, అది అప్పటికే వెళ్లిపోవడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.

    దీంతో 'గో ఫస్ట్‌' విమానయాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా ఏవియేషన్ మినిస్టర్, ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.

    డీజీసీఏ

    జనవరిలో మూడో జరిమానా విధించిన డీజీసీఏ

    'గో ఫస్ట్‌' విమాన ఘటనను డీజీసీఏ చాలా సీరియస్‌గా తీసుకుంది. బాధ్యతలను ఉల్లంఘించినందుకు ఎయిర్‌లైన్‌‌కు షోకాజు నోటీసు జారీ చేసింది.

    దీంతో 'గో ఫస్ట్‌' ఎయిర్‌లైన్ జనవరి 25 షోకాజ్ నోటీసుకు తమ సమాధానాన్ని డీజీసీఏకు సమర్పించింది. 'గో ఫస్ట్‌' ఎయిర్‌లైన్ సమాధానానికి సంతృప్తి చెందని డీజీసీఏ రూ. 10లక్షల జరిమానా విధించింది.

    ఈ మధ్య కాలంలో దేశీయ విమాన సంస్థలపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో డీజీసీఏ కూడా విమానయాన సంస్థలపై కొరడా ఝులిపిస్తోంది. ఇటీవల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్‌కు రెండు జరిమానాలు విధించింది. అవి కూడా కూడా జనవరిలోనే విధించింది. దీంతో జనవరిలో డీజీసీఏ విధించిన జరిమానాలు మూడు చేరడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విమానం
    కర్ణాటక
    భారతదేశం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    విమానం

    NOTAMలో సమస్య వలన అమెరికా అంతటా ఆగిపోయిన కొన్ని వేల విమానాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం నేపాల్
    నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే! నేపాల్
    నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం నేపాల్

    కర్ణాటక

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య.. భారతదేశం
    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం భారతదేశం

    భారతదేశం

    జనవరి 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఆరు దశబ్దాల తర్వాత మొదటిసారి తగ్గిన చైనా జనాభా చైనా
    XUV400 ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశంలో లాంచ్ చేసిన మహీంద్రా ఆటో మొబైల్
    పాక్ మహిళను రెండోపెళ్లి చేసుకున్న దావూద్, సంచలన విషయాలను వెల్లడించిన 'డాన్' మేనల్లుడు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025