NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / డీజీసీఏ: ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్‌' విమానానికి రూ.10లక్షల జరిమానా
    భారతదేశం

    డీజీసీఏ: ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్‌' విమానానికి రూ.10లక్షల జరిమానా

    డీజీసీఏ: ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్‌' విమానానికి రూ.10లక్షల జరిమానా
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 27, 2023, 06:13 pm 1 నిమి చదవండి
    డీజీసీఏ: ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్‌' విమానానికి రూ.10లక్షల జరిమానా
    'గో ఫస్ట్‌' ఎయిర్‌లైన్‌కు రూ.10లక్షల జరిమానా విధించిన డీజీసీఏ

    బెంగళూరు విమానాశ్రయంలో 55 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్‌' విమానానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.10 లక్షల జరిమానా విధించింది. జనవరి 9న, 55 మంది ప్రయాణికులు 'గో ఫస్ట్‌' విమానంలో దిల్లీకి వెళ్లేందుకు బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. బోర్డింగ్ పాస్‌, లగేజీని చెక్-ఇన్ అయ్యాక బస్సుల్లో విమానం దగ్గరికి వెళ్లగా, అది అప్పటికే వెళ్లిపోవడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. దీంతో 'గో ఫస్ట్‌' విమానయాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా ఏవియేషన్ మినిస్టర్, ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.

    జనవరిలో మూడో జరిమానా విధించిన డీజీసీఏ

    'గో ఫస్ట్‌' విమాన ఘటనను డీజీసీఏ చాలా సీరియస్‌గా తీసుకుంది. బాధ్యతలను ఉల్లంఘించినందుకు ఎయిర్‌లైన్‌‌కు షోకాజు నోటీసు జారీ చేసింది. దీంతో 'గో ఫస్ట్‌' ఎయిర్‌లైన్ జనవరి 25 షోకాజ్ నోటీసుకు తమ సమాధానాన్ని డీజీసీఏకు సమర్పించింది. 'గో ఫస్ట్‌' ఎయిర్‌లైన్ సమాధానానికి సంతృప్తి చెందని డీజీసీఏ రూ. 10లక్షల జరిమానా విధించింది. ఈ మధ్య కాలంలో దేశీయ విమాన సంస్థలపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో డీజీసీఏ కూడా విమానయాన సంస్థలపై కొరడా ఝులిపిస్తోంది. ఇటీవల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్‌కు రెండు జరిమానాలు విధించింది. అవి కూడా కూడా జనవరిలోనే విధించింది. దీంతో జనవరిలో డీజీసీఏ విధించిన జరిమానాలు మూడు చేరడం గమనార్హం.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    కర్ణాటక
    విమానం

    తాజా

    ప్రకాష్ రాజ్ బర్త్ డే: ప్రకాష్ రాజ్ నటించిన తెలుగు సినిమాల్లోని చెప్పుకోదగ్గ తండ్రి పాత్రలు తెలుగు సినిమా
    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్ జూనియర్ ఎన్టీఆర్

    భారతదేశం

    గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్ స్మార్ట్ ఫోన్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ సోషల్ మీడియా
    రోజుకు 3GB డేటాను అందించే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు జియో
    శాన్‌ఫ్రాన్సిస్కో: 'ఖలిస్థానీ' అనుకూల శక్తులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయుల శాంతి ర్యాలీ అమెరికా

    కర్ణాటక

    'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Karnataka Assembly Elections: 124మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ కాంగ్రెస్
    అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం; టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారు? అసెంబ్లీ ఎన్నికలు
    కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్ బీజేపీ

    విమానం

    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్
    నల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చేసిన రష్యా ఫైటర్ జెట్లు అమెరికా
    ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి పాకిస్థాన్
    రన్‌వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ కేరళ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023