Bapatla : సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు.. డీజీపీ ప్రశంసలు
బీచ్లో ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణాల మీదకి వచ్చింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల సూర్యలంక బీచ్లో చోటు చేసుకుంది. సాయంత్రం సమయంలో అలల ఉదృతి పెరిగింది. ఇది గమనించకుండా ఆ వ్యక్తి మరి కాస్త లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో అతను ప్రమాద హెచ్చరిక కోసం ఏర్పటాటు చేసిన జెండాను కూడా దాటేశాడు.
వ్యక్తిని ఒడ్డుకు చేర్చిన రెస్క్యూ టీం
ఇది గమనించిన ఓ కానిస్టేబుల్ రెస్క్కూ టీం కు సమాచారం ఇచ్చారు. వెంటనే రెస్క్కూ టీం సమయస్ఫూర్తితో వ్యవహరించి సముద్రంలో మునిగిపోతన్న ఆ వ్యక్తిని ప్రాణాలతో రక్షించి, ఒడ్డుకు చేర్చాడు. అక్కడే ఓ వ్యక్తి ఇదంతా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది వైరల్గా మారడంతో దీనిపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. పోలీసుల సమయస్ఫూర్తిని మెచ్చుకొని వారు చూపించిన తెగువకు అభినందనలు తెలిపారు.