NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం
    తదుపరి వార్తా కథనం
    ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం
    జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్నిప్రమాదం

    ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం

    వ్రాసిన వారు Stalin
    Feb 01, 2023
    10:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది సజీవ దహనమయ్యారు. ధన్‌బాద్‌లోని ఆశీర్వాద్ టవర్ అపార్ట్‌మెంట్‌లో మంటలు చేలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ధన్‌బాద్‌ డీఎస్పీ ప్రకటించారు.

    అపార్ట్‌మెంట్‌లో చాలా మంది వ్యక్తులు చిక్కుకుపోయారని డీఎస్పీ చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నందున సంఖ్యను ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు.

    ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది భవనంలోని ఆరు, ఏడో అంతస్తుల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడంలో నిమగ్నమైనట్లు ఆయన పేర్కొన్నారు.

    ప్రమాదం జరిగిన సమయంలో అపార్ట్‌మెంట్‌లో 400మంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.

    జార్ఖండ్‌

    ప్రధాని మోదీ, సీఎం హేమంత్ సోరెన్ దిగ్భ్రాంతి

    అగ్నిప్రమాదం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోందని చెప్పారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలను ప్రత్యేక్షంగా సీఎం సోరెన్ పర్యవేక్షిస్తున్నారు.

    ధన్‌బాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

    బాధితులకు ప్ర‌ధాని ప్ర‌ధాన మోదీ ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పు, గాయపడిన 50,000 రూపాయలు చొప్పున అందించనున్నట్లు పీఎంఓ ట్వీట్‌ చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ధన్‌బాద్‌లో అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం వ్యక్తం చేస్తున్నట్లు పీఎంఓ ట్వీట్‌

    Deeply anguished by the loss of lives due to a fire in Dhanbad. My thoughts are with those who lost their loved ones. May the injured recover soon: PM @narendramodi

    — PMO India (@PMOIndia) January 31, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    ప్రధాన మంత్రి

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఆర్ బి ఐ
    పెద్ద నోట్ల రద్దు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025