Page Loader
West Bengal: మమతా బెనర్జీని 'ఆంటీ' అని పిలవండి: సువేందు అధికారి 
West Bengal: మమతా బెనర్జీని 'ఆంటీ' అని పిలవండి: సువేందు అధికారి

West Bengal: మమతా బెనర్జీని 'ఆంటీ' అని పిలవండి: సువేందు అధికారి 

వ్రాసిన వారు Stalin
Feb 25, 2024
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో సందేశ్‌ఖాలీలో రాజకీయ హింసపై చర్చా సందర్భంగా బెనర్జీని "దీదీ" అని పిలవడం మానేయాలని ప్రజలకు సూచించారు. ఎందుకంటే ఆమె ఇప్పుడు 'ఆంటీ' అయ్యిందన్నారు. దేశంలో అధికారంలో ఉన్న ఏకైక మహిళా ముఖ్యమంత్రి బెనర్జీ కావడంతో ఆమెను 'దీదీ' అని పిలుస్తుంటారు. సందేశ్‌ఖలీలో జరిగిన హింస వెనుక తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడు షేక్ షాజహాన్, అతని సహచరులు ఉన్నారని ఆరోపించారు. వారిని బెనర్జీ ప్రభుత్వం కాపాడుతోందన్నారు.

బీజేపీ

సందేశ్‌ఖలీలో 144 సెక్షన్ బూటకం: సువేందు అధికారి

నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని ద్వీపంలో ఫిబ్రవరి ప్రారంభం నుంచి హింస కొనసాగుతోంది. షేక్ షాజహాన్, అతని అనుచరులు బలవంతంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సందేశ్‌ఖలీలో మమత ప్రభుత్వం విధించిన 144 సెక్షన్ బూటకమని, ఇది కేవలం సందేశ్‌ఖలీకి చేరుకోకుండా బీజేపీ నేతలను ఆపడం కోసమేనని సువేందు అధికారి అన్నారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితమైనదన్నారు. 144 సెక్షన్‌ విధించి రాష్ట్రంలో పరిస్థితులను దాచిపెట్టేందుకు టీఎంసీ ప్రయత్నిస్తోందన్నారు. సందేశ్‌ఖలీ ప్రధాన విలన్ షేక్ షాజహాన్‌కు మరణశిక్ష విధించాలని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనపై సీబీఐ, ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలి.