
Air India Flight Crash : అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన శిథిలాల నుండి డిజిటల్ వీడియో రికార్డర్ స్వాధీనం
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంపై డీజీసీఏ (DGCA), ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)తో పాటు గుజరాత్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
ఈ దర్యాప్తు క్రమంలో మరో ముఖ్యమైన పరిణామం వెలుగులోకి వచ్చింది.
ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమాన శకలాల నుంచి గుజరాత్ ఎయిర్ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) డిజిటల్ వీడియో రికార్డర్ (DVR)ను స్వాధీనం చేసుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డిజిటల్ వీడియో రికార్డర్ స్వాధీనం
#WATCH | Gujarat ATS recovered a Digital Video Recorder (DVR) from the debris of the Air India plane that crashed yesterday in Ahmedabad.#ahmedabad #AhmedabadNews #planecrash #airindia #india #gujarataircrash #ahmedabadaircrash #tehran
— Bharat - As it is (@NewBharatVoice) June 13, 2025
pic.twitter.com/d5P5jonLZq
వివరాలు
వీడియో డేటా రికవరీపై దృష్టి
ఈ DVR ద్వారా విమాన ప్రమాదం సంభవించే ముందు ప్రయాణ సమయంలో ఫ్లైట్ లోపల ఏం జరిగిందో పూర్తిగా వీడియో రూపంలో రికార్డయి ఉండే అవకాశముంది.
అధికారులు ప్రస్తుతం ఆ వీడియో డేటాను రికవరీ చేయడంపై దృష్టి పెట్టారు.
ఇదే సమయంలో మరో కీలకమైన పరికరం అయిన బ్లాక్ బాక్స్ను కూడా స్వాధీనం చేసుకునే అవకాశముంది.
అదే జరిగితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదికను అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.