NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajasthan's New Deputy CM: రాజస్థాన్ కొత్త డిప్యూటీ సీఎంలలో ఒకరైన 'రాయల్' దియా కుమారి ఎవరో తెలుసా?  
    తదుపరి వార్తా కథనం
    Rajasthan's New Deputy CM: రాజస్థాన్ కొత్త డిప్యూటీ సీఎంలలో ఒకరైన 'రాయల్' దియా కుమారి ఎవరో తెలుసా?  
    రాజస్థాన్ కొత్త డిప్యూటీ సీఎంలలో ఒకరైన 'రాయల్' దియా కుమారి ఎవరు?

    Rajasthan's New Deputy CM: రాజస్థాన్ కొత్త డిప్యూటీ సీఎంలలో ఒకరైన 'రాయల్' దియా కుమారి ఎవరో తెలుసా?  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 12, 2023
    06:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్ కొత్త ఉప ముఖ్యమంత్రులలో ఒకరిగా దియా కుమారిని బిజెపి ఎంపిక చేసింది.

    ఆమె జనవరి 30, 1971న రాజకుటుంబంలో జన్మించింది. ఆమె తాత, మాన్ సింగ్ II, బ్రిటీష్ రాజ్ కాలంలో జైపూర్‌ని చివరిగా పాలించిన మహారాజు.

    దియా కుమారి తండ్రి, బ్రిగేడియర్ సవాయ్ భవానీ సింగ్, 1971 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధంలో అతని పరాక్రమానికి మహావీర చక్ర అవార్డును అందుకున్నారు.

    రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన ఆమె తన పాఠశాల విద్యను మహారాణి గాయత్రీ దేవి పాఠశాలలో పూర్తి చేసింది.

    జైపూర్‌లోని మహారాణి కళాశాల నుండి ఉత్తీర్ణత సాధించింది. ఆమె నరేంద్ర సింగ్‌ను వివాహం చేసుకుంది.

    Details 

    మాధోపూర్ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యే 

    జైపూర్ ప్రస్తుత మహారాజా పద్మనాభ్ సింగ్‌తో సహా వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. దియా కుమారి 2018లో తన భర్తకు విడాకులు ఇచ్చింది.

    2013లో రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత దియా కుమారి రాజకీయ ప్రయాణం మొదలైంది.

    నగరాల చుట్టుపక్కల అభివృద్ధి చెందని గ్రామీణ ప్రాంతాలలో సమగ్ర అభివృద్ధిపై ఎమ్మెల్యేగా ఆమె దృష్టి సారించారు.

    2019లో, దియా కుమారి అత్యధిక మెజారిటీతో గెలిచి రాజ్‌సమంద్ నుండి పార్లమెంటు సభ్యురాలిగా జాతీయ స్థాయికి ఎదిగారు.

    Details 

    దియా కుమారి పేరు మీద ఫౌండేషన్

    రాజకీయాలకు అతీతంగా,దియా కుమారి రెండు పాఠశాలలు, ట్రస్టులు,మ్యూజియంలు,హోటళ్లు, ప్రభుత్వేతర సంస్థలతో సహా అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది.

    ఆమె ఇతర సంస్థలతోపాటు మహారాజా సవాయి మాన్ సింగ్ II మ్యూజియం ట్రస్ట్,జైఘర్ ఫోర్ట్ ఛారిటబుల్ ట్రస్ట్‌లను కూడా పర్యవేక్షిస్తుంది.

    దియా కుమారి తన పేరు మీద ప్రిన్సెస్ దియా కుమారి ఫౌండేషన్ అనే ఫౌండేషన్‌ను కూడా నడుపుతోంది.

    ఇది వృత్తిపరమైన శిక్షణ,విద్య,జీవనోపాధి కల్పన ద్వారా మహిళలు,బాలికలకు సాధికారత కల్పించడంపై దృష్టి సారిస్తుంది.

    హెరిటేజ్ మేనేజ్‌మెంట్ అండ్ ఫిలోన్ త్రఫిలో ఆమె చేసిన కృషికి జైపూర్‌లోని అమిటీ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ను అందుకుంది.

    ఇటీవల ముగిసిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాధర్ నగర్ స్థానం నుంచి దియా కుమారి 71,368 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్

    తాజా

    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు కేంద్రం నో..!  ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు యూఏఈలో సంప్రదాయ స్వాగతం .. ఇంతకీ ఈ సంప్రదాయం ఏంటంటే?(వీడియో)  డొనాల్డ్ ట్రంప్
    Renu Desai: అర్థం లేని చర్చలు మానేసి, దేశాభిమానంతో ముందుకెళ్లండి: రేణూ దేశాయ్ టాలీవుడ్
    IndusInd Bank- Airtel: నష్టాల్లో ట్రేడవుతున్న ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ఎందుకంటే..? షేర్ విలువ

    రాజస్థాన్

    రాజస్థాన్: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 27వ కేసు  భారతదేశం
    అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన నరేంద్ర మోదీ
    తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు  నరేంద్ర మోదీ
    Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025