
Pm Modi: దీపావళికి ముందే ప్రజలకు ఆనందం : మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
యూపీఏ పాలనలో ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా ఉండేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సాధారణ కుటుంబాలపై నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు కేంద్రం జీఎస్టీ రేట్లలో కీలకమైన మార్పులు చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తగా అమలు చేస్తున్న జీఎస్టీ స్లాబులపై ప్రధాని స్పందించారు. జీఎస్టీ స్లాబుల సంస్కరణల వల్ల ప్రతి ఒక్కరికీ లాభం కలుగుతుందని, దేశ చరిత్రలో ఇది ఒక విశేషమైన మలుపు అవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ మార్పులతో దేశం మరింత బలపడుతుందని, నిత్యావసర వస్తువులపై భారాన్ని తగ్గించవచ్చని అన్నారు.
వివరాలు
సమయానుసారంగా సంస్కరణలు అవసరం
సమయానుసారంగా సంస్కరణలు అవసరమవుతాయని ఆయన స్పష్టం చేశారు. యూపీఏ హయాంలో అధిక పన్నులు విధించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని మోదీ ఆరోపించారు. గతంలో పన్నుల రూపంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. దేశ చరిత్రలో ఈ సంస్కరణలు ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తాయని, ప్రజల దుర్భర జీవనానికి కాంగ్రెస్ పాలన కారణమని మోదీ తెలిపారు. జీఎస్టీ స్లాబుల సవరణలతో జీఎస్టీ సంస్కరణలతో దివాళి గిఫ్ట్ ఇచ్చాం అని అన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జీఎస్టీ సంస్కరణలపై తొలిసారిగా స్పందించిన మోదీ
Interacting with the National Awardee Teachers. Their work goes far beyond classrooms. They shape character and kindle curiosity in the Yuva Shakti. https://t.co/GgoTPhtmvd
— Narendra Modi (@narendramodi) September 4, 2025