Page Loader
Atal Setu : అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకేసిన మహిళ.. కాపాడిన డ్రైవర్, పోలీసులు
అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకేసిన మహిళ.. కాపాడిన డ్రైవర్, పోలీసులు

Atal Setu : అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకేసిన మహిళ.. కాపాడిన డ్రైవర్, పోలీసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2024
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు ఆమెను కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. ఓ మహిళ క్యాబ్‌లో వెళ్తూ అటల్ సేతు బ్రిడ్జిపై ఆగింది. ఆ తర్వాత క్యాబ్ దిగి అటల్ సేతు బ్రిడ్జి రేలింగ్ అంచున కూర్చొంది. క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడుతుండగానే ఆమె సడన్‌గా దూకే ప్రయత్నం చేసింది. క్షణాల్లో స్పందించిన క్యాబ్ డ్రైవర్ వెంటనే ఆమెను పట్టుకున్నాడు.

Details

పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

ఆ తర్వాత అటు నుంచి వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు ఆమెను పట్టుకొని సురక్షితంగా పైకి లాగారు. ఇదంతా అటల్ సేతు బ్రిడ్జిపై ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు ఉంది. ఈ వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసుల తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధితురాలు ములుంద్‌లో నివాసం ఉండే 56 ఏళ్ల రీమా ముఖేష్ పటేల్‌గా పోలీసులు గుర్తించారు.

Embed

సకాలంలో స్పందించిన మహిళ

ముంబై - అటల్‌ సేతు బ్రిడ్జిపై నుండి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. సకాలంలో స్పందించిన ట్రాఫిక్‌ పోలీసులు ఆమెను క్షేమంగా కాపాడారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. pic.twitter.com/AqnEbyKxD2— Newsmeter Telugu (@NewsmeterTelugu) August 17, 2024