Page Loader
Janasena Party: డ్రైవర్ హత్య కేసు.. జనసేన ఇంఛార్జ్ పార్టీ నుంచి బహిష్కరణ!
డ్రైవర్ హత్య కేసు.. జనసేన ఇంఛార్జ్ పార్టీ నుంచి బహిష్కరణ!

Janasena Party: డ్రైవర్ హత్య కేసు.. జనసేన ఇంఛార్జ్ పార్టీ నుంచి బహిష్కరణ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 12, 2025
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జిగా కొనసాగిన వినూత కోటాపై పార్టీ అధికారికంగా బహిష్కరణ వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు జనసేన ప్రకటనలో వెల్లడించింది. చెన్నైలో ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో వినూత పేరు ప్రధానంగా బయటపడటంతో ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలిపింది. చెన్నై మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూవం నదిలో మూడు రోజుల క్రితం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. శరీరంపై జనసేన పార్టీ సింబల్‌తో పాటు వినూత కోటా పేరు టాటూ రూపంలో ఉండటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు శ్రీకాళహస్తికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు అని గుర్తించారు. అతను వినూతకు వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్‌గా పని చేసినట్లు తెలిసింది.

Details

స్పందించిన జనసేన పార్టీ

హత్య కేసులో వినూత కోటా, ఆమె భర్తతో పాటు మరో ముగ్గురు నిందితులుగా ఉండగా, చెన్నై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం మేరకు రెండు వారాల క్రితమే వినూత, రాయుడిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధికారికంగా స్పందించింది. పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా ప్రవర్తించినందున గత కొంత కాలంగా ఆమెను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచినట్లు పేర్కొంది. హత్య కేసులో ఆరోపణల నేపథ్యంలో ఆమెను బహిష్కరిస్తున్నట్లు హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఇన్‌ఛార్జి వేములపాటి అజయ్ కుమార్ ప్రకటించారు. ఈ సంఘటనతో స్థానికంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వినూతపై కేసు విచారణ కొనసాగుతున్నదే కాక, పార్టీ నుంచి వైదొలగడం రాజకీయం పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.