Page Loader
Tirumala: తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం.. కొండ పై డ్రోన్ తో చిత్రీకరణ 
Tirumala: తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం

Tirumala: తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం.. కొండ పై డ్రోన్ తో చిత్రీకరణ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 12, 2024
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల ఆలయం సమీపంలో భద్రతా వైఫల్యంతో ఇద్దరు భక్తులు నిబంధనలను ఉల్లంఘించి ఘాట్‌రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో తిరుమల కొండలను వీడియో తీసేందుకు ప్రయత్నించారు. అస్సాంకు చెందిన భక్తులు తిరుమల కొండలను వీడియో తీశారు.ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ విభాగం ఇద్దరు భక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలిపిరిలోని సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో అధికారులు పసిగట్టకుండా డ్రోన్‌ను తమ వెంట ఎలా తీసుకొచ్చారని టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయ వ్యవహారాలను టీటీడీ నిర్వహిస్తోంది.

Details 

ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం కొండపై విమానాలు,డ్రోన్ లు నిషిద్ధం  

గత ఏడాది, ఆలయానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్ చల్ చేశాయి. అయితే డ్రోన్ కెమెరాను వినియోగించే అవకాశం లేదని టీటీడీ అధికారులు తేల్చి చెప్పారు. స్టిల్ ఫోటోగ్రఫీని ఉపయోగించి వీడియో చిత్రీకరించి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. తిరుమల మొత్తం హైఫై విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ డేగ కన్ను కింద ఉందని, డ్రోన్ కెమెరా ద్వారా వీడియో తీయడం సాధ్యం కాదని వారు చెప్పారు. టీటీడీ విచారణకు ఆదేశించింది. ఎవరైనా డ్రోన్లను ఉపయోగించి వీడియో చిత్రీకరించినట్లు తేలితే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఆలయ యంత్రాంగం హెచ్చరించింది. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం, కొండ మీదుగా విమానాలు లేదా డ్రోన్లు ఎగరడం నిషేధించబడింది.