
Tejaswi Yadav: వేదికపై తేజస్వివైపు దూసుకువచ్చిన డ్రోన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్జేడీ నేత,బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఒక ప్రమాదకర పరిస్థితి నుంచి తృటిలో తప్పించుకున్నారు. పట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్లో ఆదివారం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తుండగా, అకస్మాత్తుగా ఓ డ్రోన్ ఆయన వైపు వేగంగా దూసుకొచ్చింది. అయితే,తేజస్వీ యాదవ్ వెంటనే అప్రమత్తమై వేగంగా వెనక్కు తప్పుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన 'వక్ఫ్ను రక్షించండి.. రాజ్యాంగాన్ని కాపాడండి' అనే నినాదంతో నిర్వహించిన ర్యాలీలో చోటుచేసుకుంది.
వివరాలు
ఆంక్షలున్న ప్రదేశంలోకి ప్రవేశించిన డ్రోన్
తేజస్వీ ప్రసంగిస్తున్న సమయంలోనే డ్రోన్ అతడి దిశగా వచ్చి, కొంత సమీపంలో ఆగి తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. అపాయాన్ని గుర్తించిన తేజస్వీ వెంటనే వెనక్కి జరగడంతో ప్రమాదం తలకిందులైంది. అనంతరం ఆయన తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు, ఆంక్షలున్న ప్రదేశంలోకి ప్రవేశించిన డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.