Loading...
Dugarajapatnam Shipyard: దుగరాజపట్నంలో భారీ షిప్‌యార్డ్‌.. రూ.15 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం
దుగరాజపట్నంలో భారీ షిప్‌యార్డ్‌.. రూ.15 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం

Dugarajapatnam Shipyard: దుగరాజపట్నంలో భారీ షిప్‌యార్డ్‌.. రూ.15 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో నౌకా నిర్మాణ రంగం అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్‌ షిప్‌యార్డ్‌ను ఏర్పాటు చేసేందుకు మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సచివాలయంలో ఎండీఎల్‌, నేషనల్‌ షిప్‌బిల్డింగ్‌ అండ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ పార్క్‌-ఏపీ (ఎన్‌ఎస్‌హెచ్‌ఐపీ-ఏపీ) ప్రతినిధులు అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేశారు.

వివరాలు 

రూ.15 వేల కోట్ల పెట్టుబడి

ఈ ప్రాజెక్టులో భాగంగా వచ్చే ఐదేళ్లలో ఎండీఎల్‌ సుమారు రూ.15వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

షిప్‌యార్డ్‌ ఏర్పాటుతో ప్రత్యక్షంగా,పరోక్షంగా దాదాపు 45వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.

నౌకల నిర్మాణంతోపాటు మెరైన్‌ ఇంజినీరింగ్‌, లాజిస్టిక్స్‌, సర్వీసులు, అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నారు.

ఏటా 12 లక్షల గ్రాస్‌ టన్నుల సామర్థ్యం

ప్రతిపాదిత షిప్‌యార్డ్‌ను ఏటా 12 లక్షల గ్రాస్‌ టన్నుల నౌకల నిర్మాణ సామర్థ్యంతో ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు.

ఇందులో ట్యాంకర్లు, బల్క్‌ క్యారియర్లు, కంటైనర్‌ నౌకలు, ఎల్‌ఎన్‌జీ క్యారియర్లు, భారీ ప్రత్యేక నౌకలను నిర్మించనున్నారు.

భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అవసరాన్ని బట్టి ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది.

వివరాలు 

షిప్‌బిల్డింగ్‌-కమ్‌-పోర్ట్‌ క్లస్టర్‌ అభివృద్ధి

దుగరాజపట్నంలో షిప్‌బిల్డింగ్‌-కమ్‌-పోర్ట్‌ క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

టెక్నో-ఎకనామిక్‌ ఫీజిబిలిటీ రిపోర్ట్‌ ప్రకారం షిప్‌బిల్డింగ్‌, షిప్‌ రిపేర్‌ యార్డ్‌ ఏర్పాటుకు సుమారు రూ.29,254 కోట్లు, పోర్టు అభివృద్ధికి రూ.9,513 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్  

ADVERTISEMENT