NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kerala college ragging horror: ప్రైవేట్ భాగాలపై డంబెల్స్.. కంపాస్‌ల‌తో గుచ్చి.. 3 నెలలు కొట్టి.. కేరళ విద్యార్థుల ర్యాగింగ్ 
    తదుపరి వార్తా కథనం
    Kerala college ragging horror: ప్రైవేట్ భాగాలపై డంబెల్స్.. కంపాస్‌ల‌తో గుచ్చి.. 3 నెలలు కొట్టి.. కేరళ విద్యార్థుల ర్యాగింగ్ 
    కేరళ విద్యార్థుల ర్యాగింగ్.. ఆ కేసులో అయిదుగురు విద్యార్థులు అరెస్టు

    Kerala college ragging horror: ప్రైవేట్ భాగాలపై డంబెల్స్.. కంపాస్‌ల‌తో గుచ్చి.. 3 నెలలు కొట్టి.. కేరళ విద్యార్థుల ర్యాగింగ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 12, 2025
    01:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్‌కి పాల్పడ్డ ఆరోపణలపై గాంధీనగర్ పోలీసులు ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారు.

    ఫస్ట్ ఇయర్‌లో చేరిన విద్యార్థులు గత మూడు నెలలుగా సీనియర్ల వేధింపులకు గురవుతున్నట్లు సమాచారం.

    ఈ కేసులో సెకండ్ ఇయర్ నర్సింగ్ విద్యార్థులు సామ్యూల్ జాన్సన్, జీవా ఎన్ఎస్ అలాగే మూడో సంవత్సరం విద్యార్థులు రాహుల్ రాజ్, రిజిల్‌జిత్, వివేక్ ఎన్వీ ప్రధాన నిందితులుగా ఉన్నారు.

    ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం వీరిపై కేసు నమోదు చేయడంతో, కాలేజీ ప్రిన్సిపల్ వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.

    పోలీసుల ప్రకారం, ఫస్ట్ ఇయర్‌లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సీనియర్లపై ఫిర్యాదు చేశారు.

    వివరాలు 

    మద్యం కొనడానికి సీనియర్లు జూనియర్ల నుంచి ₹800 వసూలు

    సీనియర్లు తమ దుస్తులు విప్పించి, మర్మాంగాలపై డంబెల్స్ పెట్టేవారని బాధితులు తెలిపారు.

    అంతేకాకుండా, కొన్ని సందర్భాల్లో కంపాస్‌తో గుచ్చి గాయాలు చేసి, వాటిపై లోషన్ రాసేవారని చెప్పారు.

    ఈ ర్యాగింగ్ ఘటన ప్రధానంగా మెన్స్ హాస్టల్‌లో జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

    అంతేకాకుండా, మద్యం కొనడానికి సీనియర్లు జూనియర్ల నుంచి ₹800 డబ్బులు వసూలు చేసినట్లు తేలింది.

    వారు జూనియర్లను బలవంతంగా మద్యం తాగేలా చేసి, ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరించేవారని వివరించారు.

    కొన్ని రోజుల క్రితం డబ్బులు ఇవ్వలేదని ఓ జూనియర్ విద్యార్థిని సీనియర్ కొట్టాడు.

    ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొట్టాయం ప్రభుత్వ మెడికల్ కాలేజీ పరిధిలో నర్సింగ్ కాలేజీ పనిచేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ

    తాజా

    Upcoming SUVs: ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే! టాటా మోటార్స్
    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్
    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్! యూపీఐ
    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్

    కేరళ

    కేరళ విషాదం.. రూ. కోటీ విరాళం అందించిన చిరంజీవి, రామ్ చరణ్ చిరంజీవి
    Kerala:మెదడు తిన్న అమీబా కారణంగా 6 నెలల్లో 5 మరణాలు.. తిరువనంతపురంలో అత్యధిక కేసులు   భారతదేశం
    Wayanad Landslide: వాయనాడ్ విపత్తు కోసం నిధులు సేకరించిన 13 ఏళ్ల బాలిక .. భారతదేశం
    Wayanad landslide: 'మీ ధైర్యం, త్యాగం మరువలేము'.. ఆర్మీ సైనికులకు సెల్యూట్ కొండచరియలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025