
Durgapur Gang Rape Case: దుర్గాపూర్ గ్యాంగ్రేప్ కేసులో కీలక పరిణామం .. బాధితురాలి స్నేహితుడి అరెస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్లో దుర్గాపూర్లోని వైద్య విద్యార్థిని అత్యాచార కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని భావిస్తున్న ఈ ఘటనలో, పోలీసులు బాధితురాలి స్నేహితుని అరెస్ట్ చేయడంతో విచారణ కొత్త కోణంలోకి మళ్లింది. బాధితురాలి వాంగ్మూలం, స్నేహితుడు చెప్పిన విషయాల మధ్య అనుమానాస్పద తేడాలు ఉన్నందున, మంగళవారం సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సామూహిక అత్యాచారం జరగలేదని బాధితురాలి క్లాస్మేట్ అయిన స్నేహితుడే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ మేరకు అసన్సోల్-దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ చౌద్రీ మంగళవారం మీడియాకు వివరాలు తెలిపారు.
వివరాలు
విరుద్ధమైన వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజ్తో మారిన విచారణ గతి
"ఇప్పటివరకు లభించిన ఆధారాలు,వాంగ్మూలాలను బట్టి, ఇది గ్యాంగ్రేప్గా కనిపించడం లేదు. కేవలం ఒకే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డట్లు తేలింది" అని ఆయన అన్నారు. నిందితుడి దుస్తులు, ఘటన స్థలంలోని ఆధారాలను ఫోరెన్సిక్కు పంపించామని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు. కేసు విచారణలో భాగంగా, డిప్యూటీ కమిషనర్ అభిషేక్ గుప్తా నేతృత్వంలోని బృందం ఇప్పటికే అరెస్టయిన ఐదుగురు నిందితులను ఘటన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే, వారి వివరాల్లో కూడా స్పష్టత లభించలేదు. మరోవైపు, బాధితురాలు కూడా మొదట ఒకరే అత్యాచారం చేశాడని, ఆ తర్వాత ఐదుగురూ చేసినట్లు వాంగ్మూలాన్ని మార్చడం గందరగోళానికి దారితీసింది.
వివరాలు
సీసీటీవీలో రికార్డయిన బాధితురాలు, ఆమె స్నేహితుడు హాస్టల్లోకి నడిచిపోతున్న దృశ్యాలు
హాస్టల్ గేటు వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. ఐదుగురు నిందితులు తనను లాక్కెళ్లినప్పుడు, బాధితురాలి స్నేహితుడు భయంతో పారిపోయాడని ఆమె పేర్కొంది. కానీ, ఘటన తర్వాత, బాధితురాలు, ఆమె స్నేహితుడు ఎలాంటి ఆందోళన లేకుండా హాస్టల్లోకి నడిచిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఆమె దుస్తులు నలగడం లేదా జుట్టు చెరగడం వంటి దృశ్యాలు అందులో లేవు. హాస్టల్ సెక్యూరిటీ సిబ్బందిని సహాయం కోరినట్లు కూడా ఫుటేజ్లో ఆధారాలు లేవు.
వివరాలు
కేసులో కీలకంగా మారిన బాధితురాలి తండ్రి ఫిర్యాదు
ఘటన జరిగిన రోజున, బాధితురాలి కుమార్తె స్నేహితుడు గంటన్నర ఆలస్యంగా మాత్రమే కుటుంబానికి సమాచారం అందించినట్లు తండ్రి తెలిపారు. 10వ తేదీన అతడిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, ఘటన తర్వాత బాధితురాలి ఫోన్ నుంచి ఆమె స్నేహితుడికి ఫోన్ చేసిన వ్యక్తులు ఫోన్ తిరిగి ఇవ్వాలంటే రూ.3,000 డిమాండ్ చేసినట్లు, బాధితురాల దగ్గరున్న రూ.200 ను తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ కొత్త పరిణామాలతో కేసు మరింత సంక్లిష్టతకు గురైంది.