NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Israel-Hamas conflict: హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు   
    తదుపరి వార్తా కథనం
    Israel-Hamas conflict: హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు   
    Israel-Hamas conflict: హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు

    Israel-Hamas conflict: హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు   

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 09, 2023
    03:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న కేరళకు చెందిన ఒక నర్సు భారతదేశంలో నివసిస్తున్న తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ దాడిలో గాయపడినట్లు సమాచారం.

    ఏడేళ్లుగా ఇజ్రాయెల్‌లో ఉన్న షీజా ఆనంద్ (41), శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ప్రారంభించిన సమయంలో తన క్షేమ సమాచారాలను తెలపడానికి ఆమె భారతదేశంలోని తన భర్తకు కాల్ చేసింది.

    ఈ సమయంలో భయంకరమైన పెద్ద శబ్ధంతో కాల్ అకస్మాత్తుగా కట్ అయింది. అనంతరం తోటి కేరళీయుడు ఆనంద్ కుటుంబానికి ఆమె గాయపడిందని, శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సమాచారం అందించాడు.

    మరో సర్జరీ కోసం ఆనంద్‌ని మరో ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిపాడు.

    Details 

    బెత్లెహెమ్‌హోటల్‌లో చిక్కుకుపోయిన కేరళకు చెందిన  200మంది 

    ఆనంద్ భర్త,ఇద్దరు పిల్లలు ఇండియాలో ఉన్నారు. భర్త పూణేలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిలావుండగా, కేరళకు చెందిన 200 మందికి పైగా బెత్లెహెమ్‌లోని ఒక హోటల్‌లో చిక్కుకుపోయి ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు.

    మాస్‌కు హాజరవుతున్నప్పుడు ఎయిర్ రైడ్ సైరన్‌లు వినిపించాయని గ్రూపు సభ్యుల్లో ఒకరైన జాయ్ చెప్పినట్లు మలయాళ వార్తాపత్రిక మాతృభూమి నివేదించింది.

    వారి షెడ్యూల్ ప్రకారం, వారు సోమవారం ఈజిప్ట్ బయలుదేరాల్సి ఉంది.కానీ యుద్ధ మేఘాలు కమ్ముకోడంతో బెత్లెహెమ్‌లోని హోటల్ వారిని ప్రస్తుతానికి అక్కడే ఉండవలసిందిగా కోరారు.

    Details 

    ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయ పౌరులు 

    కొచ్చికి చెందిన మరో 45 మంది పాలస్తీనాలోని ఓ హోటల్‌లో చిక్కుకుపోయినట్లు సమాచారం. మాతృభూమి ప్రకారం,వారంతా సురక్షితంగా ఉండడమే కాకుండా వారికి సరిహద్దు దాటేందుకు అనుమతి కూడా లభించింది.

    ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లకు ఇజ్రాయెల్‌లో పరిస్థితిని వివరించారు.

    మూడు రోజుల పోరాటంలో ఇప్పటికే ఇరువైపులా 1,100 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించారు. దాదాపు 18,000 మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    Israel-Hamas conflict: నెత్తురోడుతున్న పశ్చిమాసియా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 1,100 మంది మృతి  అంతర్జాతీయం
    ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు  ఇజ్రాయెల్
    ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి.. అమెరికా-ఇరాన్ 6 బిలియన్ డాలర్ల ఒప్పందానికి లింకేంటి? అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025