Page Loader
మణిపూర్‌, జైపూర్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు
మణిపూర్‌, జైపూర్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు

మణిపూర్‌, జైపూర్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 21, 2023
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌ ఉక్రుల్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున భూమికంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5‌గా నమోదైంది. ఈ మేరకు నేషనల్‌ సిస్మాలజీ సెంటర్‌ ప్రకటించింది. ఉదయం 5 గంటల సమయంలో 20 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. అసలే అమానుష ఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలతో హోరెత్తుతున్న క్రమంలో భూకంపాలు రావడం ప్రజలను ఉలిక్కిపడేలా చేస్తోంది. మరోవైపు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోనూ భూమి కంపించింది. ఉదయం 4 గంటల సమయంలో భూకంపం వచ్చిందని అక్కడి అధికారులు ప్రకటించారు.

DETAILS

ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు : అధికారులు

భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.4గా గుర్తించినట్లు నేషనల్ సిస్మాలజి సెంటర్ వెల్లడించింది. ప్రజలందరూ తెల్లవారుజామున గాఢ నిద్రలోకి జారుకోగా భూమి ఆకస్మికంగా కంపించింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లోకి పరుగు లంకించుకున్నారు. ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు రాజస్థాన్‌లోని జైపూర్‌ సహా ఇతర ప్రాంతాలలో భూకంపం వచ్చినట్లు ఆ రాష్ట్ర మాజీ సీఎం వసుంధర రాజే తెలిపారు. ఈశాన్య రాష్ట్రం మిజోరాంలోని నొగొపా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూమి కంపించినట్లు మిజోరాం అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కంపించిన భూమి