NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజ‌స్థాన్‌లో ఘోరం.. కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తగలబెట్టిన దుండగలు
    తదుపరి వార్తా కథనం
    రాజ‌స్థాన్‌లో ఘోరం.. కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తగలబెట్టిన దుండగలు
    కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తగలబెట్టిన దుండగలు.. జోధ్‌పూర్ సమీపంలో ఘోర హ‌త్య‌

    రాజ‌స్థాన్‌లో ఘోరం.. కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తగలబెట్టిన దుండగలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 19, 2023
    06:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్ కు స‌మీప గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు వ్యక్తులను దారుణంగా గొంతు కోసి అనంతరం ఆధారాలు దొరకకుండా దహనం చేశారు.

    ఈ ఘటనలో న‌లుగురు కాలి బూడిదైన విషాద సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

    మృతుల్లో ఓ ఆర్నెళ్ల చిన్నారి కూడా ఉండటం తీవ్ర విచారకరంగా మారింది. జోధ్‌పూర్ నగరానికి 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఓసియాన్ స‌మీపంలోని చౌరాయి గ్రామంలో ఈ అమానుషం జ‌రిగింది.

    ఈ నేపథ్యంలో రాజకీయ ప్రకంపణలూ చెలరేగాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్ర‌భుత్వ నిర్లక్ష్యాన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ మేరకు ఆందోళ‌నలు వ్యక్తం చేశాయి.

    DETAILS

    వ్య‌క్తిగ‌త క‌క్షసాధింపు వ‌ల్లే ఈ హ‌త్య‌లు : పోలీసులు

    సాక్షాత్తు రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ సొంత జిల్లాలోనే ఈ ఘోరం వెలుగుచూడటం పట్ల ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చౌరాయిలో గ‌త రాత్రి జరిగిన ఘ‌ట‌నలో పున‌ర‌మ్ (55) ఏళ్ల వ్య‌క్తి నివాసాన్ని కాల్చిబూడిద చేశారు.

    ఈ ఘ‌ట‌న‌లో పున‌ర‌మ్‌ సహా ఆయ‌న భార్య భ‌న్వ‌రి (50) కోడ‌లు దాపు (23), ఆమె కుమార్తె 6 ఏళ్ల పసిబాలిక అవశేషాలను పోలీసులు గుర్తించారు. ఆ శ‌రీరాలు మంట‌ల్లో పూర్తిగా కాలిపోయినట్లు నిర్దారించారు.

    ముందుగా గొంతులు కోసిన దుండగలు తర్వాత దహనానికి పాల్ప‌డిన‌ట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు.వ్య‌క్తిగ‌త క‌క్షసాధింపు వ‌ల్లే ఈ హ‌త్య‌లు చోటు చేసుకుని ఉండొచ్చనే కోణంలో ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    జోధ్‌పూర్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? ప్రధాన మంత్రి
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం

    జోధ్‌పూర్

    జోధ్‌పూర్‌లో దారుణం; ప్రియుడి ఎదుటే దళిత బాలికపై సామూహిక అత్యాచారం  రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025