తదుపరి వార్తా కథనం

Earthquakes : ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు.. భయంతో ప్రజలు బయటకి పరుగులు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 22, 2024
11:42 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఆదివారం ఉదయం 10:40 గంటలకు ముండ్లమూరులో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ ప్రకంపనలు మొదలైన వెంటనే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
శనివారం 10:35 గంటల సమయంలో కూడా ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, కురిచేడు మండలాల్లో భూ ప్రకంపనలొచ్చాయి.
Details
మూడేళ్లుగా ఈ ప్రాంతంలో తరచుగా స్వల్ప భూ ప్రకంపనలు
రిక్టర్ స్కేల్పై ఈ ప్రకంపనలను 3.1గా నమోదుచేశారు. ఈ భూ ప్రకంపనల కారణంగా గుండ్లకమ్మ నది పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అంతర్గత మార్పులు అనుసంధానించారు.
మూడేళ్లుగా ఈ ప్రాంతంలో తరచుగా స్వల్ప భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి.
దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మీరు పూర్తి చేశారు