Earthquake: ఢిల్లీ, సోనిపట్లో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 19, 2026
10:23 am
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర భారత ప్రాంతంలో భూకంపాలు నమోదు అయ్యాయి. ప్రధానంగా దిల్లీ, హర్యానా ప్రాంతాలలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ ప్రకారం దీని తీవ్రత 2.8గా నమోదైనది. భూకంప కేంద్రం భూగర్భంలో సుమారు 5 కిలోమీటర్ల లోతులో ఉండగా, హర్యానాలోని సోనిపట్ జిల్లాలో కూడా కంపనాలు నమోదయ్యాయి. సోమవారం ఉదయం 8:44 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. దీని కారణంగా స్థానికులు భయభీతులై ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తారు. అయితే ఇప్పటివరకు ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం గురించి అధికారిక సమాచారం తెలియలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఢిల్లీ, సోనిపట్లో భూకంపం
M 2.8 Earthquake Recorded in North Delhi This Morning#earthquake #northdelhi #delhiearthquake #breakingnews pic.twitter.com/PZOjf519gL
— Savera Times Haryana (@Savera_Haryana) January 19, 2026