Delhi: హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్/ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం,2002లోని నిబంధనల ప్రకారం న్యూదిల్లీలోని CMD, హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్ ₹24.95 కోట్ల విలువైన మూడు ఆస్తులను అటాచ్ చేసింది. ముంజాల్,ఇతరులపై అక్రమంగా భారతదేశం నుండి విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకున్నందుకు కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 135 కింద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదు ఆధారంగా ED దర్యాప్తు ప్రారంభించిందని దర్యాప్తు సంస్థ తెలిపింది. ప్రాసిక్యూషన్ ఫిర్యాదులో విదేశీ కరెన్సీ/విదేశీ మారకానికి సమానమైన రూ. 54 కోట్లను అక్రమంగా భారత్ నుంచి తరలించారని పేర్కొంది.
జప్తు, అటాచ్మెంట్ మొత్తం విలువ సుమారు ₹50 కోట్లు
ముంజాల్ ఇతర వ్యక్తుల పేరిట విదేశీ మారకద్రవ్యం/విదేశీ కరెన్సీని జారీ చేసి, ఆ తర్వాత విదేశాల్లో తన వ్యక్తిగత ఖర్చులకు వినియోగించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని ED తెలిపింది. పవన్ ముంజాల్ ప్రాంగణంలో ఈడీ 'సెర్చ్ ఆపరేషన్స్' నిర్వహించింది ఆగస్ట్ 1న, ముంజాల్,అతని కంపెనీకి చెందిన ఇతర అధికారుల ప్రాంగణంలో ED సోదాలు నిర్వహించింది. డిజిటల్ ఆధారాలు, ఇతర నేరారోపణ ఆధారాలతో పాటు ₹25 కోట్ల (సుమారు) విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. జప్తు, అటాచ్మెంట్ మొత్తం విలువ సుమారు ₹50 కోట్లు ఉంటుందని ఏజెన్సీ తెలిపింది. మార్చి 2022లో, పన్ను ఎగవేత ఆరోపణలపై హీరో మోటార్కార్ప్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ముంజాల్ నివాసంలో కూడా డిపార్ట్మెంట్ సోదాలు నిర్వహించింది.