Page Loader
Delhi Excise Scam Case: కేజ్రీవాల్‌ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని.. కోర్టును ఆశ్రయించిన ఈడీ 
కేజ్రీవాల్‌ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని.. కోర్టును ఆశ్రయించిన ఈడీ

Delhi Excise Scam Case: కేజ్రీవాల్‌ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని.. కోర్టును ఆశ్రయించిన ఈడీ 

వ్రాసిన వారు Stalin
May 20, 2024
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)సోమవారం ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. జూన్ 2న తీహార్ జైలు అధికారులకు కేజ్రీవాల్ లొంగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ED అదనంగా 14 రోజుల కస్టడీని అభ్యర్థించింది. ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ ప్రస్తుత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేజ్రీవాల్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. జూన్ 2లోగా లొంగిపోవాలని కేజ్రీవాల్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ లొంగిపోయిన తర్వాత మరో 14రోజుల పాటు జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగించాలని కోర్టును అభ్యర్థిస్తూ ఈడీ ఈరోజు దరఖాస్తును దాఖలు చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేజ్రీవాల్ కస్టడీపై  కోర్టును ఆశ్రయించిన ఈడీ