NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Heavy Rains: అల్పపీడన ప్రభావం.. ఏపీలో స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు
    తదుపరి వార్తా కథనం
    Heavy Rains: అల్పపీడన ప్రభావం.. ఏపీలో స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు
    అల్పపీడన ప్రభావం.. ఏపీలో స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

    Heavy Rains: అల్పపీడన ప్రభావం.. ఏపీలో స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 21, 2024
    09:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది.

    ఇది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

    ఈ అల్పపీడనం ఏపీ తీరానికి సమాంతరంగా పయనించి, మయన్మార్ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది.

    దీని ప్రభావం వల్ల కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

    తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

    Details

    విజయనగరం జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు

    ప్రస్తుతం వాయుగుండం చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 390 కి.మీ., విశాఖకు దక్షిణంగా 430 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

    ఇది గంటకు 5 కి.మీ. వేగంతో ఈశాన్య దిశగా కదులుతూ, ఏపీ తీరానికి సమాంతరంగా ప్రయాణించే సూచనలు కనిపిస్తున్నాయి.

    వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది.

    గోపాలపట్నం ఇందిరానగర్‌లో ప్రహరీ కూలిపోయింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.

    విజయనగరం జిల్లాలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి, కారుమబ్బులు వాతావరణాన్ని మరింత చల్లగా మారుస్తున్నాయి.

    Details

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    వర్షాల తీవ్రత దృష్ట్యా, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, విద్యార్థుల భద్రత కోసం జిల్లా ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

    ప్రధాన పోర్టుల వద్ద మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.

    ఈ వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచించింది.

    ఏపీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారీ వర్షాలు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    భారీ వర్షాలు

    #Newsbytesexplainer: భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం.. 9 మంది మృతి  ఆంధ్రప్రదేశ్
    Trains Cancelled: భారీ వర్షాల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల్లో నేడు రద్దయిన రైళ్ల వివరాలివే.. భారతదేశం
    Prakasm Barrage: ఏపీని కుదిపేస్తున్న భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీపై రెండో ప్రమాద హెచ్చరిక జారీ ఆంధ్రప్రదేశ్
    Telangana Rains: తెలంగాణలో ఇవాళ 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. విద్యా సంస్థలకు సెలవు తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు తీపికబురు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం భారతదేశం
    Andhrapradesh: ఏపీ రెరా వద్ద పెండింగ్‌లోని 85 దస్త్రాల పరిష్కారం భారతదేశం
    Andhrapradesh: రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం  అమరావతి
    New tourism policy: కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025