NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ganesh Immersion: వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు.. 25వేల మందితో బందోబస్తు 
    తదుపరి వార్తా కథనం
    Ganesh Immersion: వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు.. 25వేల మందితో బందోబస్తు 
    వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు.. 25వేల మందితో బందోబస్తు

    Ganesh Immersion: వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు.. 25వేల మందితో బందోబస్తు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 16, 2024
    04:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ పరిధిలో వినాయక నిమజ్జనాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు లక్ష విగ్రహాలు నిమజ్జనానికి తరలిరానున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

    ఈ సందర్భంగా 25,000 మంది పోలీసులను బందోబస్తును నిర్వహించారు.

    ముఖ్యంగా హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ 3,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

    ఈ ఏడాది హుస్సేన్‌ సాగర్‌లో 25,000 నుంచి 30,000 వరకు గణపతి విగ్రహాలను నిమజ్జనం చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

    ఖైరతాబాద్‌ గణపతి విగ్రహాన్ని మధ్యాహ్నం 1.30లోపు నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

    Details

    మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు

    మహిళల భద్రత ప్రత్యేకంగా షీటీమ్స్‌ను నియమించారు, హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాల్లో 12 షీటీమ్స్‌ ప్రత్యేక పహారా కాయనున్నాయి.

    ట్రాఫిక్ నియంత్రణ కోసం నగరవ్యాప్తంగా 67 డైవర్షన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లకు (9010203626, 8712660600, 040-27852482) ఫోన్‌ చేయాలన్నారు.

    ఖైరతాబాద్‌ గణపతి శోభాయాత్ర మంగళవారం ఉదయం 6.30గంటలకు ప్రారంభం కానుంది. భద్రతా చర్యలలో భాగంగా 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

    బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభమై, 16కి.మీ దూరం ప్రయాణించి ఎన్టీఆర్ మార్గ్‌ వద్ద ముగియనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    వినాయక చవితి

    తాజా

    Ajit Doval: ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ ముందస్తు డెలివరీల కోసం రష్యాకు వెళ్లనున్న అజిత్‌ దోవల్  అజిత్ దోవల్‌
    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ స్టాక్ మార్కెట్
    IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్..  ఐపీఎల్
    Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్  ఉత్తర్‌ప్రదేశ్

    హైదరాబాద్

    Air pollution: దేశంలోని 10 నగరాల్లో ఏడు శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణం, అగ్రస్థానంలో ఏ రాష్ట్రం ఉందో తెలుసా?  వాయు కాలుష్యం
    Hyderabad : విషాదం.. అమెరికాలో నీటమునిగి హైదరాబాద్ యువకుడు మృతి అమెరికా
    CM Revanth Reddy: ముచ్చెర్లను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతాం : సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి
    Rowdy Sheeter Murder: పాతబస్తీలో రౌడీషీటర్‌ను కాల్చి చంపిన దుండగలు ఆంధ్రప్రదేశ్

    వినాయక చవితి

    Jio AirFiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం: ముకేశ్ అంబానీ  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
    Vinayaka Temples: భారతదేశంలోని ప్రసిద్ధ వినాయకుడి దేవాలయాలు  పండగ
    వినాయక చవితికి ముందు రోజు జరుపుకునే గౌరీ గణేష్ హబ్బా గురించి మీకు తెలుసా?  పండగ
    వినాయక చవితి: పర్యావరణం సురక్షితంగా ఉండేలా గణపతి డెకరేషన్ ఇలా చేయండి  పండగ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025