
ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఓట్ల కౌంటింగ్ తేదీ మార్పు
ఈ వార్తాకథనం ఏంటి
5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక కౌంటింగ్(counting) మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
మిజోరం(Mizoram)లో ఓట్ల లెక్కింపు తేదీ మారుస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. మిజోరంలో డిసెంబర్ 3న కాకుండా డిసెంబర్ 4న ఓట్లను లెక్కించనున్నట్లు వెల్లడించింది.
డిసెంబర్ 3 ఆదివారం అవుతుంది. ఈ క్రమంలో ఆ రోజు క్రైస్తవులకు పవిత్రమైన రోజు.
మిజోరంలో ఎక్కువ సంఖ్యలో క్రైస్తవులు ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ తేదీని మార్చాలని అన్ని పార్టీలు ఈసీకి అభ్యర్థనలను పంపాయి.
దీంతో కౌంటింగ్ తేదీని మారుస్తున్నట్లు ఎన్నికల సంఘం(Election Commission) ప్రకటించింది.
మిగతా 4 రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మిగతా రాష్ట్రాల్లో డిసెంబర్ 3న కౌంటింగ్
Election Commission of India revises the date of counting for the General Election to the Legislative Assembly of Mizoram from 3rd December, 2023 (Sunday) to 4th December, 2023 (Monday).
— ANI (@ANI) December 1, 2023
EC says, "The Commission has received several representations from various quarters… pic.twitter.com/DIrR1rXJeQ