NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Elections: ఏపీలో ఖాళీ పదవుల భర్తీకి ఎన్నికలు.. ఈసీ కొత్త నోటిఫికేషన్
    తదుపరి వార్తా కథనం
    Elections: ఏపీలో ఖాళీ పదవుల భర్తీకి ఎన్నికలు.. ఈసీ కొత్త నోటిఫికేషన్
    ఏపీలో ఖాళీ పదవుల భర్తీకి ఎన్నికలు.. ఈసీ కొత్త నోటిఫికేషన్

    Elections: ఏపీలో ఖాళీ పదవుల భర్తీకి ఎన్నికలు.. ఈసీ కొత్త నోటిఫికేషన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 27, 2025
    05:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత, రాష్ట్రంలో మరికొన్ని ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది.

    స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ కోసం త్వరలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఎన్నికల ఏర్పాట్ల కోసం కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు.

    రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేశారు.

    ఈ నెల 30లోగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వచ్చే నెల మూడో తేదీన ఈ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వహించనున్నారు.

    Details

    ఖాళీగా చైర్ పర్సన్ పదవులు

    ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ పదవులు, నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ పదవులు ఖాళీగా ఉన్నాయి.

    వీటికి ఎన్నికలు నిర్వహిస్తారు. అలాగే బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలలో వైస్ చైర్‌పర్సన్ పదవుల భర్తీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి.

    ఈ ఖాళీల భర్తీ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం. సంబంధిత మున్సిపాలిటీల్లో కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేందుకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

    అయితే రాష్ట్రంలో రెగ్యులర్ మున్సిపల్ ఎన్నికలు జరిగే వరకు, ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవుల్లో ఎన్నికైన వారు కొనసాగుతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఆంధ్రప్రదేశ్

    APPSC Notification: వివిధ ఉద్యోగాలకు ఎగ్జామ్‌ షెడ్యూల్‌ ప్రకటించిన ఏపీపీఎస్సీ భారతదేశం
    Vijayanand: త్వరలో వాట్సాప్ ద్వారా 150 ప్రభుత్వ సేవలు వాట్సాప్
    Sankranti: తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగే ముక్కనుమ విశేషాలివే! సంక్రాంతి స్పెషల్
    Polavaram Project: రాజీవ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు పర్యటన పోలవరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025