NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. 22 మంది మావోయిస్టుల మృతి
    తదుపరి వార్తా కథనం
    Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. 22 మంది మావోయిస్టుల మృతి
    ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. 22 మంది మావోయిస్టుల మృతి

    Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. 22 మంది మావోయిస్టుల మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 20, 2025
    02:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. గురువారం బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు,మావోయిస్టుల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయి.

    ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న సాంద్రమైన అడవుల్లో భద్రతా దళాలు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించాయి.

    ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి సంయుక్త బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.

    ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

    వివరాలు 

    భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలు 

    బీజాపూర్ జిల్లాలోని గంగలూరు ప్రాంతంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు తిష్టవేశారని సమాచారం అందడంతో భద్రతా బలగాలను అక్కడికి తరలించినట్లు ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.

    కాల్పులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, భద్రతా సిబ్బంది పూర్తి నివేదిక అందించిన తర్వాత మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

    ఇక మరోవైపు, నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేలుడు సంభవించగా, ఈ ఘటనలో భద్రతా సిబ్బందిలో ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఛత్తీస్‌గఢ్
    ఛత్తీస్‌గఢ్‌

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఛత్తీస్‌గఢ్

    Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎంగా విష్ణుదేవ్ సాయి  ఛత్తీస్‌గఢ్‌
    Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే? అసెంబ్లీ ఎన్నికలు
    నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు  మధ్యప్రదేశ్
    Mahadev betting app case: దుబాయ్‌లో పట్టుబడిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని  ఛత్తీస్‌గఢ్‌

    ఛత్తీస్‌గఢ్‌

    Chhattisgarh: నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌లో CRPF అధికారి మృతి  ఛత్తీస్‌గఢ్
    Congress: డిసెంబర్ 21న CWC సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ  కాంగ్రెస్
    Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం  కేంద్ర ప్రభుత్వం
    City Centre Mall: రాయ్‌పూర్‌లో విషాద ఘటన..తండ్రి చేతుల్లోంచి జారిపడి పసికందు మృతి  ఛత్తీస్‌గఢ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025