
Pak spy: రాజస్థాన్లో గూఢచర్యం.. రక్షణ రహస్యాలు పాక్కు లీక్!
ఈ వార్తాకథనం ఏంటి
వలపు వలలో పడి రాజస్థాన్లోని మంగత్ సింగ్ అనే వ్యక్తి పాక్ మహిళ కోసం భారత రక్షణశాఖ రహస్యాలను చేరవేశాడు. చివరికి అతను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారుల చేతిలో చిక్కి జైలుపాలయ్యాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం గూఢచర్యం చేసినట్లు ఆరోపణలతో శుక్రవారం అల్వార్కు చెందిన మంగత్ సింగ్ను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. దర్యాప్తులో వెల్లడైనట్లు, మంగత్ సింగ్ రెండు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో పాక్కు చెందిన ఇషా శర్మతో పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఆమె కోసం సైన్యం, రక్షణ శాఖలకు చెందిన కీలక సమాచారాన్ని సేకరించి పాకిస్థాన్కు అందించేవాడిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
Details
వివిధ నిఘా సంస్థలు విచారణ
అతను అల్వార్ కంటోన్మెంట్ ఏరియా, ఇతర వ్యూహాత్మక రక్షణ కేంద్రాలపై సమాచారం అందించినట్లు కూడా దర్యాప్తు వెల్లడించింది. ఈ కేసును సెంట్రల్ ఎంక్వైరీస్ సెంటర్లో వివిధ నిఘా సంస్థలు విచారణ చేస్తున్నారు. ఇదేవిధంగా, మంగళవారం రాజస్థాన్లోని జైసల్మేర్కు చెందిన మహేంద్ర ప్రసాద్ను సీఐడీ (భద్రత) నిఘా విభాగం అరెస్టు చేసింది. చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లోని DRDO గెస్ట్ హౌస్ మేనేజర్గా పనిచేసే మహేంద్రపై, పాక్ ISI కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నారు. సీఐడీ అధికారులు పేర్కొన్నట్లుగా, పాక్కు గూఢచర్యం చేసేవారు దేశంలో ఏ మూలన ఉన్నా, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి నిఘా సంస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు.