NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Etala Rajender: కాళేశ్వరం కమిషన్‌ విచారణలో ఈటల రాజేందర్‌: అన్ని విషయాలూ కేసీఆర్‌,హరీష్‌ దగ్గరే! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Etala Rajender: కాళేశ్వరం కమిషన్‌ విచారణలో ఈటల రాజేందర్‌: అన్ని విషయాలూ కేసీఆర్‌,హరీష్‌ దగ్గరే! 
    కాళేశ్వరం కమిషన్‌ విచారణలో ఈటల రాజేందర్‌: అన్ని విషయాలూ కేసీఆర్‌,హరీష్‌ దగ్గరే!

    Etala Rajender: కాళేశ్వరం కమిషన్‌ విచారణలో ఈటల రాజేందర్‌: అన్ని విషయాలూ కేసీఆర్‌,హరీష్‌ దగ్గరే! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 06, 2025
    02:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాళేశ్వరం ప్రాజెక్టు పై జరుగుతున్న విచారణలో భాగంగా భాజపా ఎంపీ, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ హాజరై,కమిషన్‌ ఎదుట తన వాదనను వినిపించారు.

    గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయనను ఈ విచారణలో ప్రశ్నించారు.

    విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈటల, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పూర్తి సమాచారం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌,నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుకే తెలుసన్నారు.

    ఆర్థిక శాఖ పాత్ర ఈ ప్రాజెక్టులో చాలా పరిమితంగా ఉందని స్పష్టంగా తెలిపారు.

    "ఈ ప్రాజెక్టు విషయంలో ఆర్థిక శాఖకు అన్ని విషయాలూ ముందుగా తెలియవు. దీనికి సంబంధించి నా పాత్ర అంతగా ఏమీ లేదు," అని ఆయన వివరించారు.

    వివరాలు 

    క్యాబినెట్‌ సబ్‌ కమిటీ కి హరీశ్‌రావు ఛైర్మన్‌

    ప్రాజెక్టును మళ్లీ డిజైన్‌ చేయడానికి అప్పట్లో కేసీఆర్‌ నేతృత్వంలో క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారని చెప్పారు.

    ఈ కమిటీకి హరీశ్‌రావు ఛైర్మన్‌గా ఉన్నారని గుర్తు చేశారు. మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణానికి నీటి లభ్యత అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

    ఆనకట్టల నిర్మాణం అనేది సాంకేతిక నిపుణుల ఆధీనంలో జరిగే అంశమని, రాజకీయ నేతలకు దానిపై స్పష్టమైన అవగాహన ఉండకపోవచ్చని ఆయన అన్నారు.

    "ప్రాథమికంగా రూ.63,000 కోట్లతో ఈ ప్రాజెక్టు ప్రణాళిక తయారైంది. కానీ, వివిధ కారణాల వల్ల వ్యయం రూ.82,000 కోట్లకు చేరింది," అని వివరించారు.

    ఈ విచారణ సందర్భంగా కమిషన్‌ ఆర్థిక సంబంధిత విషయాలపై ఈటల రాజేందర్‌ను ప్రశ్నించింది.

    వివరాలు 

    "నా కణతపై తుపాకీ పెట్టినా సరే,నేను నిజమే చెబుతాను": ఈటల

    ముఖ్యంగా,కాళేశ్వరం కార్పొరేషన్‌ రుణాల్లో ఆర్థిక శాఖ పాత్ర ఉందా అని అడిగారు.

    దీనిపై స్పందించిన ఈటల, ఆ శాఖకు దీంట్లో ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టంచేశారు."ఇది పూర్తిగా నీటిపారుదల శాఖ పరిధిలోని అంశం,"అని చెప్పారు.

    "నా కణతపై తుపాకీ పెట్టినా సరే,నేను నిజమే చెబుతాను.తప్పు,ఒప్పు ఎవరిది అన్నది ప్రజలే నిర్ణయిస్తారు"అని ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

    కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని నివేదికలను బహిరంగం చేయాలి.ఈ ప్రాజెక్టును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకూడదు.

    ఎవరి వల్ల నష్టం జరిగిందో వారిపై చర్యలు తీసుకొని శిక్షించాలి.

    ఈప్రాజెక్టును తన మానస పుత్రిక అని కేసీఆర్‌ ఎన్నోసార్లు చెప్పారు.నేను ఏ పార్టీకి చెందిన వాడినైనా, ఏ పదవిలో ఉన్నా కూడా నైతిక విలువలకే ప్రాధాన్యత ఇస్తాను,"అని చెప్పారు.

    వివరాలు 

    కమిషన్‌ ఎదుట ఈటల తెలిపిన అంశాలివే..! 

    క్యాబినెట్‌ నిర్ణయానుసారమే ఆనకట్టల నిర్మాణం ప్రారంభమైందని ఈటల వివరించారు.

    సాంకేతిక కమిటీ,క్యాబినెట్‌ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

    సీడబ్ల్యూసీ (CWC) మహారాష్ట్ర అభ్యంతరాల కారణంగా ప్రాజెక్టు లొకేషన్‌ను తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినట్లు తెలిపారు.

    నిధుల కొరత నేపథ్యంలో కాళేశ్వరం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

    పారిశ్రామిక అవసరాలు, తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయాలన్న అంశం డీపీఆర్‌లో (DPR) ఉండేదని తెలిపారు.

    బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో లోపముందా? అన్న ప్రశ్నకు ఈటల స్పందిస్తూ, నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలు నీటిపారుదల శాఖ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఈటల రాజేందర్

    తాజా

    Etala Rajender: కాళేశ్వరం కమిషన్‌ విచారణలో ఈటల రాజేందర్‌: అన్ని విషయాలూ కేసీఆర్‌,హరీష్‌ దగ్గరే!  ఈటల రాజేందర్
    NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం  సుప్రీంకోర్టు
    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్

    ఈటల రాజేందర్

    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  తాజా వార్తలు
    రెండో రోజూ దిల్లీలోనే ఈటల.. ఏ క్షణంలోనా కీలక ప్రకటన వచ్చే అవకాశం ప్రధాన మంత్రి
    ఈటల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర.. ఈటల సతీమణి జమున సంచలన ఆరోపణలు భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025