తదుపరి వార్తా కథనం

Tamilnadu: తమిళనాడు పటాకుల గోదాములో పేలుడు.. ఇద్దరు దుర్మరణం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 01, 2024
10:46 am
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో తూత్తుకుడి జిల్లా నజరేత్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీ గోదాములో శనివారం సాయంత్రం ఘోర పేలుడు సంభవించింది.
ఈ ఘటనలోల ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
మరో నలుగురు గాయపడ్డారు, ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
పటాకులను ఒకచోట నుంచి మరొకచోటికి తరలించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతులను కన్నన్, విజయ్లుగా గుర్తించారు.
Details
మృతుల కుటుంబానికి నష్టపరిహారం
గాయపడిన నలుగురిని తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షలు, గాయపడిన వారికి రూ. 1 లక్ష సాయం అందజేయనున్నట్లు తెలిపారు.