NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'Extending...help': యెమెన్ లో కేరళ నర్సుకు మరణశిక్ష.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    'Extending...help': యెమెన్ లో కేరళ నర్సుకు మరణశిక్ష.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన
    యెమెన్ లో కేరళ నర్సుకు మరణశిక్ష.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన

    'Extending...help': యెమెన్ లో కేరళ నర్సుకు మరణశిక్ష.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 31, 2024
    12:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యెమెన్‌లో కేరళకు చెందిన నర్సు నిమిషప్రియ (36)కు మరణశిక్ష విధించిన విషయం పై భారత విదేశాంగశాఖ స్పందించింది.

    ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్ తెలిపారు.

    నిమిష కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వారు వివరించారు.

    యెమెన్‌ జాతీయుడి హత్య కేసులో నిమిషప్రియ కేరళకు చెందిన నిందితురాలిగా ఉన్నారు.

    యెమెన్‌ అధ్యక్షుడు రషద్‌ అల్ అలిమి ఇటీవల నిమిషకు మరణశిక్షను ధృవీకరించారు.

    ఈ శిక్షను త్వరలోనే అమలు చేసే అవకాశం ఉంది.

    ఈ కేసులో, నిమిష మరణశిక్షను రద్దు చేయించేందుకు ఆమె తల్లి ప్రేమకుమారి చేసిన అన్ని ప్రయత్నాలు, అధ్యక్షుడి నిర్ణయంతో నీరుగారిపోయాయి.

    వివరాలు 

     అబ్దో మెహదీ హత్య కేసులో నిమిషప్రియ అరెస్టు 

    ఈ ఏడాది ప్రారంభంలోనే నిమిష తల్లి యెమెన్‌కు వెళ్లి అక్కడే ఉంటున్నారు.

    నిమిషను శిక్ష నుంచి కాపాడేందుకు ఏం చేయాలో ఆమెకు స్పష్టంగా తెలిసినప్పటికీ, న్యాయాధికారులు, హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యుల క్షమాభిక్షపై ఆధారపడి ఉంటుంది.

    ఈ క్షమాభిక్ష మాత్రమే నిమిషను మరణశిక్ష నుండి రక్షించగలుగుతుంది.

    2017లో జరిగిన యెమెన్‌ జాతీయుడు అబ్దో మెహదీ హత్య కేసులో నిమిషప్రియను అరెస్టు చేశారు.

    ఆ తర్వాత, కోర్టు ఆమెను దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది.

    సుప్రీంకోర్టు ఆమె చేసిన అప్పీల్‌ను తిరస్కరించిన తర్వాత, ఇప్పుడు యెమెన్‌ అధ్యక్షుడు ఆమె మరణశిక్షను ధృవీకరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ

    తాజా

    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్
    Motivational: భయంతో ఉన్న మనస్సు విఫలమవుతుంది… భయాన్ని అధిగమించేందుకు ప్రేరణ కలిగించే 5 పాయింట్స్ ఇవే..  జీవనశైలి
    Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌! టాలీవుడ్

    కేరళ

    PM Modi's meet with Pope: పోప్ కు మీరిచ్చే గౌరవం ఇదేనా ? కాంగ్రెస్ ను నిలదీసిన బీజేపీ నరేంద్ర మోదీ
    IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లోబయోటెక్నాలజీ విద్యార్థిని ఆత్మహత్య  భారతదేశం
    kerala: రైలు మిడిల్ బెర్త్ పడి  కేరళ వ్యక్తి మృతి   తెలంగాణ
    Kerala: కేరళలో రుతుపవనాలు తీవ్రతరం.. 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ నైరుతి రుతుపవనాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025