NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు 
    తదుపరి వార్తా కథనం
    విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు 
    విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు

    విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు 

    వ్రాసిన వారు Stalin
    May 19, 2023
    11:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలును మహబూబ్‌నగర్ వరకు పొడిగించనున్నట్లు తూర్పు కోస్తా రైల్వే (ఈసీఓఆర్) ప్రకటించింది.

    మే 20 నుంచి ఈ సర్వీసు అమల్లోకి వస్తుందని చెప్పింది. రైలు నంబర్ 12861 ఎక్స్ ప్రెస్ వైజాగ్ నుంచి సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి చెప్పారు.

    అలాగే ఆ రైలు కాచిగూడ నుంచి ఉదయం 6:55 గంటలకు బయలుదేరి అదే రోజు ఉదయం 9:20 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుందని పేర్కొన్నారు.

    విశాఖ

    మహబూబ్‌నగర్ నుంచి సాయంత్రం 4.10కి ప్రయాణం మొదలు

    తిరుగు ప్రయాణంలో 12862 నంబర్ గల ఎక్స్ ప్రెస్ రైలు మహబూబ్‌నగర్-కాచిగూడ- విశాఖపట్నం వెళ్తుందని అధికారులు చెప్పారు.

    మహబూబ్‌నగర్ నుంచి సాయంత్రం 4:10 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 6:10 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని వెల్లడించారు.

    కాచిగూడ నుంచి సాయంత్రం 6:20 గంటలకు బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 6:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని పేర్కొన్నారు.

    ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపూడి, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట ఉమ్దానగర్ షాద్‌నగర్, జడ్చర్లలో ఆగుతుందని వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    రైల్వే శాఖ మంత్రి
    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    విశాఖపట్టణం

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ

    రైల్వే శాఖ మంత్రి

    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం భారతదేశం
    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ సికింద్రాబాద్
    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు ధర్మవరం
    కర్నాటక: హుబ్లీ రైల్వే స్టేషన్‌‌కు గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో చోటు కర్ణాటక

    తాజా వార్తలు

    హాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ వీసాలు
    ఏప్రిల్‌లో 20నెలల కనిష్టానికి భారత వాణిజ్య లోటు  భారతదేశం
     అమెరికా: ట్రంప్-రష్యా వ్యవహారంలో ఎఫ్‌బీఐ ఆరోపణలను తప్పబట్టిన ప్రాసిక్యూటర్  డొనాల్డ్ ట్రంప్
    విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025