Page Loader
విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు 
విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు

విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు 

వ్రాసిన వారు Stalin
May 19, 2023
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలును మహబూబ్‌నగర్ వరకు పొడిగించనున్నట్లు తూర్పు కోస్తా రైల్వే (ఈసీఓఆర్) ప్రకటించింది. మే 20 నుంచి ఈ సర్వీసు అమల్లోకి వస్తుందని చెప్పింది. రైలు నంబర్ 12861 ఎక్స్ ప్రెస్ వైజాగ్ నుంచి సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి చెప్పారు. అలాగే ఆ రైలు కాచిగూడ నుంచి ఉదయం 6:55 గంటలకు బయలుదేరి అదే రోజు ఉదయం 9:20 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుందని పేర్కొన్నారు.

విశాఖ

మహబూబ్‌నగర్ నుంచి సాయంత్రం 4.10కి ప్రయాణం మొదలు

తిరుగు ప్రయాణంలో 12862 నంబర్ గల ఎక్స్ ప్రెస్ రైలు మహబూబ్‌నగర్-కాచిగూడ- విశాఖపట్నం వెళ్తుందని అధికారులు చెప్పారు. మహబూబ్‌నగర్ నుంచి సాయంత్రం 4:10 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 6:10 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని వెల్లడించారు. కాచిగూడ నుంచి సాయంత్రం 6:20 గంటలకు బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 6:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపూడి, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట ఉమ్దానగర్ షాద్‌నగర్, జడ్చర్లలో ఆగుతుందని వెల్లడించారు.