NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Punjab Farmers: శంబు సరిహద్దు వద్ద పంజాబ్ రైతులపై అణిచివేత.. దేశవ్యాప్తంగా నిరసనకు రైతు సంఘాల పిలుపు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Punjab Farmers: శంబు సరిహద్దు వద్ద పంజాబ్ రైతులపై అణిచివేత.. దేశవ్యాప్తంగా నిరసనకు రైతు సంఘాల పిలుపు 
    శంబు సరిహద్దు వద్ద పంజాబ్ రైతులపై అణిచివేత.. దేశవ్యాప్తంగా నిరసనకు రైతు సంఘాల పిలుపు

    Punjab Farmers: శంబు సరిహద్దు వద్ద పంజాబ్ రైతులపై అణిచివేత.. దేశవ్యాప్తంగా నిరసనకు రైతు సంఘాల పిలుపు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 20, 2025
    12:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శంభూ,ఖనౌరీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలను పంజాబ్ పోలీసులు బుధవారం బలవంతంగా తొలగించారు.

    ఈ పరిణామానికి స్పందనగా రైతు సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించాయి.

    సంయుక్త్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా వంటి సంఘాలు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి.

    డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నారు. పంజాబ్‌లో కొందరు రైతులు రాష్ట్రవ్యాప్తంగా చెక్కా జామ్‌కి పిలుపునిచ్చారు.

    వివరాలు 

    రైతు నేతల హౌస్ అరెస్టు

    రైతు నాయకులు జగ్జీత్ సింగ్ దల్లేవాల్, సర్వన్ సింగ్ పందేర్ సహా ఇతరుల అరెస్టును రైతు సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

    పంజాబ్‌లోని గ్రామాల సమీపంలోని రోడ్లను రైతులు బ్లాక్ చేస్తున్నారు. అనేక మంది రైతు నేతలను హౌస్ అరెస్టు చేశారు.

    ఈ అరెస్టులను నిరసిస్తూ పంజాబీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేపట్టారు.

    ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నేతలు అమరిందర్ సింగ్ రాజా, గుర్జిత్ ఔజ్లా, అమర్ సింగ్ డిమాండ్ చేశారు.

    పోలీసుల అదుపులో ఉన్న రైతులు నిరాహార దీక్షకు దిగారు. సంగ్రూర్, పాటియాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

    వివరాలు 

     హైవేపై ధర్నా చేస్తున్న రైతులను చెదరగొట్టిన పోలీసులు 

    జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌ను జలంధర్ కంటోన్మెంట్‌కు తరలించారు. శంభూ బోర్డర్‌ను పంజాబ్ వైపు నుంచి క్లియర్ చేశారు.

    చండీఘడ్ హైవేపై ధర్నా చేస్తున్న రైతులను పోలీసులు చెదరగొట్టారు.

    గత ఏడాది ఫిబ్రవరి 13న రైతులు ఖనౌరీ, శంభూ సరిహద్దుల్లో నిరసనలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

    రైతుల శిబిరాలను తొలగించేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు. అక్కడున్న రైతులను అక్కడి నుంచి తరిమివేసి, గుడారాలను కూల్చివేశారు.

    శంభూ, ఖనౌరీ సరిహద్దులకు వెళుతున్న రైతు నాయకులు జగ్జీత్ సింగ్ దల్లేవాల్, సర్వన్ సింగ్ పందేర్‌తో పాటు 200 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    మొహాలీ వద్ద దల్లేవాల్, పందేర్‌ను, ఖనౌరీ సరిహద్దు వద్ద మరో 200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు.

    వివరాలు 

    సరిహద్దు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం

    ఈ రెండు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంబులెన్సులు, బస్సులు, అగ్నిమాపక వాహనాలను అక్కడే నిలిపారు.

    ఖనౌరీ వద్ద సుమారు 3,000 మంది పోలీసులను మోహరించారు. శంభూ సరిహద్దుకు మరో బలగాన్ని తరలించారు. రైతులు తమ టెంట్లను ఖాళీ చేయాలని వారికి 10 నిమిషాల గడువు ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    పంజాబ్

    Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు రైలు ప్రమాదం
    Bunty Bains : ప్రముఖ పంజాబీ గీత రచయిత బంటీ బెయిన్స్‌పై హత్యాయత్నం తాజా వార్తలు
    Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    Russia: పంజాబ్ వాసుల ఘోస; పర్యటనకు వెళ్తే.. బలవంతంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి పంపిన రష్యా రష్యా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025