NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Farmers Protest: రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. రేపు మళ్లీ 'చలో దిల్లీ' మార్చ్ 
    తదుపరి వార్తా కథనం
    Farmers Protest: రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. రేపు మళ్లీ 'చలో దిల్లీ' మార్చ్ 
    Farmers Protest: రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. రేపు మళ్లీ 'చలో దిల్లీ' మార్చ్

    Farmers Protest: రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. రేపు మళ్లీ 'చలో దిల్లీ' మార్చ్ 

    వ్రాసిన వారు Stalin
    Feb 20, 2024
    09:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ప్రభుత్వ ప్రతిపాదనను రైతు నాయకులు తోసిపుచ్చారు.

    పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి కొనుగోలు చేయడానికి ఐదేళ్ల ఒప్పందాన్ని కేంద్ర తరఫున వచ్చిన ముగ్గురు కేంద్ర మంత్రుల కమిటీ ప్రతిపాదించింది.

    ఎంఎస్‌పీ చట్టబద్ధ హామీ తప్ప తమకు ఏది కూడా ఆమోదయోగ్యం కాదని రైతు నాయకులు కేంద్రం ప్రభుత్వ ప్రతినిధులతో తేల్చి చెప్పారు.

    ఈ ఐదేళ్ల ప్రతిపాదనను ఆదివారం రైతులతో జరిగిన చర్చల్లో కేంద్రం ప్రతిపాదించింది.

    అయితే సోమవారం రైతు సంఘాల వేదికలపై చర్చించిన నాయకులు.. కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించారు.

    రైతులు

    చర్చలకు ఎప్పుడూ సిద్ధమే: రైతు నేత

    చర్చలు విఫలమైన నేపథ్యంలో ఫిబ్రవరి 21న చలో దిల్లీ మార్చ్‌ను చేపట్టోబతున్నట్లు రైతు నాయకుడు పధేర్ చెప్పారు.

    ప్రస్తుతం ప్రభుత్వంతో తదుపరి సమావేశం ఉండదన్నారు. అయితే చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమే అన్నారు.

    తమ డిమాండ్లను అంగీకరించాలని లేదా దిల్లీలో శాంతియుతంగా నిరసన తెలపడానికి అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని మరో రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్వాల్ వివరించారు.

    తమ డిమాండ్లపై ప్రభుత్వం సీరియస్‌గా లేదన్నారు. 23 పంటలకు ఎంఎస్పీ అంటే కనీస మద్దతు ధర కోసం ఫార్ములాను ప్రభుత్వం నిర్ణయించాలన్నారు.

    ప్రభుత్వం రూ.1.75లక్షల కోట్ల విలువైన పామాయిల్‌ను బయటి నుంచి కొనుగోలు చేస్తుందని, ఆ మొత్తాన్ని నూనె గింజలకు వ్యవసాయానికి కేటాయిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని దల్వాల్ పేర్కొన్నారు.

    రైతులు

    రైతుల డిమాండ్‌ ఏమిటి?

    రైతుల అతిపెద్ద డిమాండ్ ఎంఎస్‌పిపై చట్టపరమైన హామీ. ప్రభుత్వం ఎంఎస్పీపై చట్టం తీసుకురావాలని రైతులు అంటున్నారు.

    ఎంఎస్‌పిపై స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎంఎస్‌పికి హామీ ఇచ్చే చట్టం తీసుకువస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు అది జరగలేదని రైతు సంఘాలు చెబుతున్నాయి.

    స్వామినాథన్ కమిషన్ రైతులకు వారి పంటల ధరకు ఒకటిన్నర రెట్లు చెల్లించాలని సిఫారసు చేసింది. కమిషన్ నివేదిక వచ్చి 18 ఏళ్లు గడిచినా, ఎంఎస్‌పీపై సిఫార్సులు ఇంకా అమలు కాలేదని రైతులు అంటున్నారు.

    దీంతోపాటు పింఛన్‌, రుణమాఫీ, విద్యుత్‌ ఛార్జీలు పెంచరాదని, లఖింపూర్‌ ఖేరీ హింసాకాండలో బాధితులైన రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    కేంద్ర ప్రభుత్వం
    తాజా వార్తలు

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    దిల్లీ

    Schools shut: చలి ఎఫెక్ట్.. 5వ తరగతి వరకు పాఠశాలల మూసివేత  పాఠశాల
    Sonipat: సోనిపట్‌లో ట్రక్కు, కారు ఢీ.. ఇద్దరు ఢిల్లీ పోలీసులు మృతి  రోడ్డు ప్రమాదం
    Delhi: 3.6డిగ్రీల సెల్సియస్‌@ దిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్టమైన ఉష్ణోగ్రతలు నమోదు ఉష్ణోగ్రతలు
    IndiGo Airlines: ఇండిగో విమానంలో షాకింగ్ ఘటన.. పైలట్ పై దాడి చేసిన ప్రయాణికుడు  భారతదేశం

    కేంద్ర ప్రభుత్వం

    ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 21.8 శాతం పెరుగుదల.. రూ. 9.57 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు  ఆర్థిక శాఖ మంత్రి
    చైనా,పాకిస్థాన్‌లతో వ్యాపారంపై భారత్ ఆంక్షలు.. తమకు తెలియకుండా ఎలాంటి వాణిజ్యం చేయకూడదని రాష్ట్రాలకు ఆదేశాలు  భారతదేశం
    ఆకలి సూచిక : పాకిస్తాన్ కంటే దిగువ స్థానంలో భారత్.. సూచీ విధాన లోపమే కారణమంటున్న కేంద్రం  ఆహారం
    Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఎంతంటే? దీపావళి

    తాజా వార్తలు

    Donald Trump: మోసం కేసులో ట్రంప్‌కు 364 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన కోర్టు  డొనాల్డ్ ట్రంప్
    KCR Birthday: కేసీఆర్‌కు బర్త్ డే విషెష్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్  రేవంత్ రెడ్డి
    Arvind Kejriwal: విశ్వాస పరీక్షను నెగ్గిన కేజ్రీవాల్.. బీజేపీకి వార్నింగ్  అరవింద్ కేజ్రీవాల్
    Tamil Nadu: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది సజీవ దహనం  తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025