NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / IIM Vizag's Campus: ఐఐఎం వైజాగ్ క్యాంపస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    IIM Vizag's Campus: ఐఐఎం వైజాగ్ క్యాంపస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 
    ఐఐఎం వైజాగ్ క్యాంపస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    IIM Vizag's Campus: ఐఐఎం వైజాగ్ క్యాంపస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 20, 2024
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    IIM Vizag Campus: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గంభీరం విశాఖపట్టణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) శాశ్వత క్యాంపస్‌ను మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

    ఇది భారతదేశంలోని ప్రముఖ మేనేజ్‌మెంట్ విద్యా సంస్థలలో ఒకటైన IIM విశాఖపట్నం ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.

    నగర శివారున ఆనందపురం మండలం గంభీరంలో 436 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ఏర్పాటైంది.

    శాశ్వత క్యాంపస్‌కు 2015 జనవరి 17న అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ శంకుస్థాపన చేశారు.

    ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు హాజరు కానున్నారు.

    Details 

    రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీ.. విశాఖ ఐఐఎం 

    ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొంటారు.

    భవనాల నిర్మాణానికి అవసరమైన 472.61 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

    శాశ్వత క్యాంపస్ దాదాపు 62,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు.

    అలాగే, 1500 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ ప్యానల్స్‌ సైతం ఏర్పాటు చేశారు.

    అదనంగా, ఇందులో ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌, క్రికెట్‌ మైదానం,ఇండోర్‌,అవుట్‌డోర్‌ గేమ్స్‌కు అనుగుణమైన సదుపాయాలు, జిమ్‌, యోగా, మెడిటేషన్‌ సెంటర్లను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

    రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం విశాఖకు ఐఐఎంను కేటాయించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్
    Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్! బంగారం
    Rohit Sharma: నేటి నుంచి వాంఖ‌డేలో అందుబాటులోకి రానున్న 'రోహిత్ శ‌ర్మ' స్టాండ్ రోహిత్ శర్మ

    విశాఖపట్టణం

    ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు ఏలూరు
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక అత్యాచారం
    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ వైజాగ్
    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025