తదుపరి వార్తా కథనం

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది దుర్మరణం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 02, 2024
05:40 pm
ఈ వార్తాకథనం ఏంటి
రంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది.
నియంత్రణ కోల్పోయి కూరగాయల వ్యాపారులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో పదిమంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్-బీజాపుర్ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా, లారీ వారి వైపు దూసుకొచ్చింది.
ఈ సంఘటనతో వ్యాపారులు భయంతో పరుగులు తీశారు. లారీ వేగంతో చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.
క్షతగాత్రులను వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.