దేశంలో స్వల్పంగా పరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,962 మందికి వైరస్
దేశంలో గత 24 గంటల్లో 3,962 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. అయితే బుధవారంతో పోలీస్తే కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైనట్లు కేంద్ర పెర్కొంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 36,244 ఉన్నట్లు కేంద్రెం చెప్పింది. మొత్తం కేసుల్లో ఇది 0.08 శాతంగా వెల్లడించింది. 24 గంటల్లో 7,873 మంది కోవిడ్ రోగులు వైరస్ నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 4,43,92,828కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 2.17 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 92.72 కోట్ల కోవిడ్ పరీక్షలు చేసినట్ల కేంద్రం చెప్పింది.