NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam Terror Attack: ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు.. ఎంట్రీ, ఎగ్జిట్‌ రూట్స్‌ను బ్లాక్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pahalgam Terror Attack: ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు.. ఎంట్రీ, ఎగ్జిట్‌ రూట్స్‌ను బ్లాక్‌
    ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు.. ఎంట్రీ,ఎగ్జిట్‌ రూట్స్‌ను బ్లాక్‌

    Pahalgam Terror Attack: ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు.. ఎంట్రీ, ఎగ్జిట్‌ రూట్స్‌ను బ్లాక్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 29, 2025
    04:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పెహల్‌గామ్‌ ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణను వేగవంతం చేసింది.

    ఈ కేసులో కీలకమైన ఆధారాలు సేకరించే క్రమంలో సుమారు 45 మంది ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించింది.

    వీరిలో స్థానిక ఫొటోగ్రాఫర్లు, దుకాణదారులు, డ్రైవర్లు ఉన్నారు. విచారణ సందర్భంగా వారి స్టేట్‌మెంట్లను నమోదు చేశారు.

    ఈ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బైసరాన్‌ లోయలోకి ప్రవేశించేందుకు, బయటకు వెళ్లేందుకు ఉండే మార్గాలను ఉగ్రవాదులు ముందే మూసివేసినట్లు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలంలో పేర్కొనడం జరిగింది.

    దాంతో సందర్శకులకు అక్కడ చిక్కుకుపోయే పరిస్థితి తలెత్తింది.

    వివరాలు 

    హిందూ, ముస్లింలుగా విడగొట్టాలని సూచన

    ఘటన సందర్భంగా ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ గేటు ద్వారా లోపలికి ప్రవేశించారని చెప్పారు.

    మరో ఉగ్రవాది ఎగ్జిట్‌ గేటు వద్ద నిఘా పెట్టి, ఎవరూ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నట్లు తెలిపారు.

    తొలిసారి కాల్పులు ఎగ్జిట్‌ గేటు వద్దే ప్రారంభమయ్యాయని వర్ణించారు. దీంతో భయపడిన పర్యాటకులు ఎంట్రీ గేటు వైపు పరుగులు తీయగా, అక్కడి ఉగ్రవాదులు తమపై ఉచితంగా కాల్పులు జరిపినట్లు వివరించారు.

    టూరిస్టులంతా ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నాక, ఉగ్రవాదులు వారిని మగవారు, మహిళలుగా వేరు చేయాలని ఆదేశించారు.

    కానీ సందర్శకులు దీనికి అంగీకరించకపోవడంతో.. వారు హిందూ, ముస్లింలుగా విడగొట్టాలని సూచించారు. దీనికీ నిరాకరణ వ్యక్తమైనందున, ఉగ్రవాదులు వరుసగా దాడులకు పాల్పడ్డారు.

    వివరాలు 

    సంప్రదాయ కశ్మీరీ దుస్తుల్లో మూడవ వ్యక్తి 

    కాల్పులకు ముందు ఉగ్రవాదులు పర్యాటకులను "కల్మా" చదవమని కోరారు.

    కల్మా పలికిన వారిని వారు వదిలిపెట్టారు.అదే సమయంలో ఎంట్రీ గేటు వైపు వచ్చిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ మొదటగా కాల్పులకు బలైన వ్యక్తిగా గుర్తించారు.

    పర్యాటక ప్రదేశంలోని టీ స్టాల్‌, ఫుడ్‌ స్టాల్‌ పరిసర ప్రాంతాల్లోనే అత్యధిక ప్రాణ నష్టం జరిగినట్లు తెలిసింది.

    దాడి అనంతరం ముగ్గురు ఉగ్రవాదులు సమీప అడవిలోకి పారిపోయారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

    ఇక దాడిలో భాగంగా ఉండే మరొక ఉగ్రవాది అడవిలోనే దాక్కొని,మిగతా ముష్కరులకు సహాయం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరు సైనిక దుస్తులు ధరించగా, మూడవ వ్యక్తి సంప్రదాయ కశ్మీరీ దుస్తుల్లో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలంలో వెల్లడైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పహల్గాం ఉగ్రవాద దాడి

    తాజా

    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్
    Manchu Vishnu: 'కన్నప్ప' విషయంలో చేసిన పెద్ద పోరపాటు అదే : మంచు విష్ణు కన్నప్ప
    Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌ గుజరాత్

    పహల్గాం ఉగ్రవాద దాడి

    Pahalgam Terror Attack: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య.. మన దేశంలో ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం.. వాటి వివరాలివే భారతదేశం
    Pahalgam Attack video: పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్త వీడియో.. తెలీకుండానే రికార్డ్‌ చేసిన టూరిస్ట్‌!  భారతదేశం
    Pakistani Nationals: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత.. పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు.. భారతదేశం
    Pahalgam attack: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాది.. మాజీ స్పెషల్ ఫోర్స్ కమాండో  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025