Ram Mandir: అయోధ్య శాటిలైట్ ఫోటోలను విడుదల చేసిన ఇస్రో.. రామమందిరం ఎలా కనిపిస్తుందో తెలుసా?
అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్షం నుంచి రామ మందిరాన్ని చిత్రాలను శాలిటైల్ సాయంతో తీసింది. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ సిరీస్ శాటిలైట్ ద్వారా తీసిన ఈ చిత్రాలలో 2.7 ఎకరాల్లో విస్తరించి ఉన్న రామజన్మభూమి సైట్ కనిపిస్తుంది. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరానికి సంబంధించిన ఈ చిత్రాలను 2023, డిసెంబర్ 16న తీసినవి కావడం గమనార్హం. ఈ ఉపగ్రహ ఫోటోల్లో దశరథ్ మహల్, సరయూ నదిని స్పష్టంగా చూడవచ్చు. ఇది కాకుండా, అయోధ్య రైల్వే స్టేషన్ కూడా కనిపిస్తుంది.