NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manipur : తాజా హింసాకాండలో ఐదుగురు పౌరులు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Manipur : తాజా హింసాకాండలో ఐదుగురు పౌరులు మృతి 
    Manipur : తాజా హింసాకాండలో ఐదుగురు పౌరులు మృతి

    Manipur : తాజా హింసాకాండలో ఐదుగురు పౌరులు మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 19, 2024
    09:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురు పౌరులను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారని పోలీసులు గురువారం తెలిపారు.

    పోలీసుల కథనం ప్రకారం, బిష్ణుపూర్ జిల్లాలోని నింగ్‌తౌఖోంగ్ ఖా ఖునౌలో నలుగురు పౌరులు, కాంగ్‌పోక్పి జిల్లా కాంగ్‌చుప్ చింగ్‌ఖాంగ్‌లో ఒకరు గుర్తుతెలియని సాయుధ దుండగులచే చంపబడ్డారు.

    బిష్ణుపూర్ జిల్లాలో నలుగురు పౌరులను చంపిన హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

    మృతులను ఓయినమ్ బమోంజావో సింగ్ (61),అతని కుమారుడు ఓయినమ్ మణితోంబ సింగ్ (32), తియం సోమేంద్ర సింగ్ (55),నింగ్‌థౌజం నబద్వీప్ సింగ్(40)గా గుర్తించారు.

    Details 

    బంకర్ హిల్స్ నుండి మనోరంజన్ మృతదేహం స్వాధీనం

    కాంగ్‌పోక్పిలో మరణించిన పౌరుడిని థియం కొంజిన్‌కు చెందిన తఖెల్లంబమ్ మనోరంజన్‌గా గుర్తించారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,కంగ్‌చుప్ చింగ్‌ఖాంగ్ సమీపంలోని బంకర్ హిల్స్ నుండి మనోరంజన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

    బుధ, గురువారాల మధ్య రాత్రి సాయుధ దుండగుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అతడు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    బుధవారం రాత్రి, తౌబాల్ జిల్లాలోని ఖంగాబోక్ వద్ద ఒక సమూహం వారిపై కాల్పులు జరపడంతో ముగ్గురు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బందికి బుల్లెట్ గాయాలు అయ్యాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    మణిపూర్

    ఎలాంటి చర్చ జరగకుండానే ముగిసిన మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు  ముఖ్యమంత్రి
    మణిపూర్‌లో ఆగని హింసకాండ.. ఖోయిరెంటాక్‌లో ప్రతీకార కాల్పుల్లో వ్యక్తి మృతి భారతదేశం
    మణిపూర్‌లో భీకర కాల్పులు.. 8 మంది మృతి, భారీగా పేలుడు పదర్థాలు స్వాధీనం భారతదేశం
    'ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' సభ్యులపై మణిపూర్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025