NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Punjab Firecracker Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Punjab Firecracker Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు
    బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు

    Punjab Firecracker Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 30, 2025
    11:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పంజాబ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సింఘేవాలా-ఫుతుహివాలా గ్రామ సమీపంలోని పొలాల్లో ఉన్న ఒక బాణసంచా కర్మాగారంలో నిన్న అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది.

    ఈ దుర్ఘటనలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.

    పేలుడు జరిగిన వెంటనే గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం బతిండాలోని ఎయిమ్స్‌కు తరలించారు.

    ఈ పేలుడుతో ఫ్యాక్టరీ భవనం రెండు అంతస్తులు క్షణాల్లోనే నేలమట్టమయ్యాయి.

    కర్మాగారంలో బాణసంచా తయారీ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌కు చెందిన హత్రాస్ ప్రాంత నివాసి అయిన కాంట్రాక్టర్ రాజ్ కుమార్ నిర్వహిస్తున్నాడు.

    ఈ ఘటన జరిగిన తరువాత అతను అక్కడి నుండి పరారయ్యాడని సమాచారం. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

    వివరాలు 

    40 మంది ఉద్యోగులు రెండు షిఫ్టుల్లో..

    ఈ ఫ్యాక్టరీ ప్యాకింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న వలస కార్మికుల వివరాల ప్రకారం,అక్కడ సుమారు 40 మంది ఉద్యోగులు రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారని తెలుస్తోంది.

    వీరిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్,బీహార్ రాష్ట్రాలకు చెందినవారేనని చెబుతున్నారు.

    ఈ ప్రమాదం గురించి మాట్లాడిన ఆర్టిసన్ అరుణ్ సక్సేనా తన అనుభవాన్ని పంచుకుంటూ, తాను అర్థరాత్రి సమయంలో ఫ్యాక్టరీ ఎదుట నిద్రపోతుండగా అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో పేలుడు జరిగిందని తెలిపాడు.

    ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పంజాబ్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

    ఎస్ఎస్పీ డాక్టర్ అఖిల్ చౌదరి,ఎస్పీ (డి) మన్మీత్ సింగ్, లంబి డిఎస్పీ జస్పాల్ సింగ్, కిలియన్‌వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కరమ్‌జిత్ కౌర్ వంటి ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.

    వివరాలు 

    ఈ కర్మాగారం తర్సేమ్ సింగ్ అనే వ్యక్తికి చెందినది 

    ఇతర సహాయక సంస్థలు కూడా స్పందించాయి. డేరా సచ్చా సౌదా సిర్సాకు చెందిన గ్రీన్ ఎస్ ఫోర్స్ కార్యదర్శులు సంఘటనా ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

    హైడ్రో మెషిన్ సహాయంతో శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

    ఈ కర్మాగారం సింఘేవాలా-ఫుతుహివాలా ప్రాంతానికి చెందిన తర్సేమ్ సింగ్ అనే వ్యక్తికి చెందినదని డిఎస్పీ జస్పాల్ సింగ్ స్పష్టం చేశారు.

    శిథిలాల కింద నుండి ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికితీశారు.

    మిగిలిన వారి కోసం సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

    ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించినట్టు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్

    తాజా

    Punjab Firecracker Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు పంజాబ్
    Pakistan: సింధూ జలాల ఒప్పందంపై ఎటువంటి రాజీ లేదు: పాక్‌ ఆర్మీ చీఫ్‌ ప్రేలాపనలు పాకిస్థాన్
    Sandeep Reddy Vanga: స్పిరిట్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్  రామ్ చరణ్
    Russia: రిక్‌ ఫార్మాట్‌ను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది: సెర్గీ లావ్రోవ్ రష్యా

    పంజాబ్

    Birthday Cake: పుట్టినరోజు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి  భారతదేశం
    Amritpal Singh: ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్ తల్లి అరెస్ట్.. కారణం ఇదే..  అమృత్‌సర్
    Birthday Cake: కేక్‌ తిని బాలిక మృతి .. మరణానికి కారణం ఇదే !  భారతదేశం
    Amritpal Singh: ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైన ఖలిస్తానీ మద్దతుదారు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025