NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సిక్కిం వరదలు: 56కి చేరిన మృతుల సంఖ్య.. 142మంది కోసం రెస్క్యూ బృందాల గాలింపు 
    తదుపరి వార్తా కథనం
    సిక్కిం వరదలు: 56కి చేరిన మృతుల సంఖ్య.. 142మంది కోసం రెస్క్యూ బృందాల గాలింపు 
    సిక్కిం వరదలు: 56కి చేరిన మృతుల సంఖ్య.. 142మంది కోసం రెస్క్యూ బృందాల గాలింపు

    సిక్కిం వరదలు: 56కి చేరిన మృతుల సంఖ్య.. 142మంది కోసం రెస్క్యూ బృందాల గాలింపు 

    వ్రాసిన వారు Stalin
    Oct 07, 2023
    10:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సిక్కింలో భారీ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 56కి చేరుకుంది.

    సిక్కింలో 26 మృతదేహాలు లభ్యం కాగా, పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నది పరీవాహక ప్రాంతంలో 30మృతదేహాలు లభ్యమయ్యాయి. వరదల కారణంగా గల్లంతు అయిన మరో 142 మంది కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.

    సిక్కింలో ఇప్పటివరకు 26మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు ధృవీకరించారు.

    మంగన్ జిల్లాలో నలుగురు, గ్యాంగ్‌టక్‌లో ఆరు, పాక్యోంగ్ జిల్లాలో ఏడుగురు ఆర్మీ సిబ్బందితో సహా మొత్తం 26మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

    పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ లెక్కల ప్రకారం, తీస్తా నది పరీవాహక ప్రాంతంలోని సిలిగురి, జల్పైగురి, కూచ్ బెహార్ అనే మూడు జిల్లాల నుంచి 30 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

    రెస్క్యూ

    మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా 

    సిక్కింలో బుధవారం తెల్లవారుజామున సంభవించిన ఆకస్మిక వరద తీవ్ర విధ్వంసానికి దారితీసింది.

    ఇది 25,000మంది ప్రజలను ప్రభావితం చేసింది, 1,200కంటే ఎక్కువ ఇళ్లు దెబ్బతిన్నాయి. 13 వంతెనలు, రోడ్లు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోయాయి.

    దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు 2,413మందిని రక్షించారు.

    రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 సహాయ శిబిరాల్లో 6,875 మంది ఆశ్రయం పొందుతున్నారు.

    మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా, శిబిరాల్లో తలదాచుకుంటున్న వారందరికీ తక్షణ సాయంగా రూ.2,000 చొప్పున ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ప్రకటించారు.

    బాధిత ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) కేంద్ర వాటా నుంచి అడ్వాన్స్‌గా రూ. 44.8 కోట్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సిక్కిం
    భారీ వర్షాలు
    వరదలు
    పశ్చిమ బెంగాల్

    తాజా

    Landslides: విరిగిన కొండచరియలు.. కైలాస్ యాత్రలో చిక్కుకున్న వందలాది యాత్రికలు  కొండచరియలు
    Pakistani spies: భారతదేశంలో పాకిస్తాన్ గూఢచారులు.. జ్యోతి మల్హోత్రా నుండి దేవేందర్ సింగ్ వరకు.. మూడ్రోజుల్లో 12 మంది అరెస్ట్..  జ్యోతి మల్హోత్రా
    KCR: బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసులు  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
    China: 'మద్యం, సిగరెట్లు వద్దు': ఖర్చులు తగ్గించుకోవాలని చైనా అధికారులకు ఆదేశం చైనా

    సిక్కిం

    లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి భారతదేశం
    సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు భూకంపం
    సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది తాజా వార్తలు
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు

    భారీ వర్షాలు

    రాగల 5 రోజుల్లో దేశవ్యాప్తంగా మరో కుంభవృష్టి.. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు ఐఎండీ
    చైనాలో తుపాను బీభత్సం; భారీ వర్షాలకు 11మంది మృతి, 27మంది గల్లంతు చైనా
    తెలంగాణలో మరో 2 రోజుల పాటు తేలికపాటి వానలు.. పలు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు తెలంగాణ
    హైదరాబాద్ బాచుపల్లిలో ఘోరం.. స్కూటీ నుంచి జారిపడ్డ చిన్నారిపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్ రోడ్డు ప్రమాదం

    వరదలు

    అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది   అస్సాం/అసోం
    అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి అస్సాం/అసోం
    నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు  హిమాచల్ ప్రదేశ్
    ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు దిల్లీ

    పశ్చిమ బెంగాల్

    రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం కోల్‌కతా
    శ్రీరామనవమి శోభాయాత్రలో మళ్లీ ఘర్షణలు; బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు బీజేపీ
    West Bengal: శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగిన హింసపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ హోంశాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025