Page Loader
Srisailam Project: శ్రీశైలం జలాశయంలో వరద ఉధృతి తగ్గుదల.. గేట్లు మూసివేత 
శ్రీశైలం జలాశయంలో వరద ఉధృతి తగ్గుదల.. గేట్లు మూసివేత

Srisailam Project: శ్రీశైలం జలాశయంలో వరద ఉధృతి తగ్గుదల.. గేట్లు మూసివేత 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2025
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎగువ ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల ప్రభావంతో గత పదిరోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగింది. అయితే ప్రస్తుతం ఆ ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టు అధికారులు అన్ని గేట్లను మూసివేశారు. ఇప్పటికీ జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుండి శ్రీశైలం జలాశయానికి సుమారు 65,985 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. ఇదే సమయంలో, శ్రీశైలం కుడిగట్టు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 68,753 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించి, తరువాత నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతానికి అది 882.50 అడుగుల వద్ద నమోదైంది.

Details

నిండుకుండలా జలాశయం

వారం రోజులలో సుంకేసుల, జూరాల నదుల నుంచి నిత్యం లక్ష క్యూసెక్కులకు పైగా వరదనీరు శ్రీశైలానికి చేరడంతో జలాశయం నిండుకుండలా మారింది. ఫలితంగా జూలై 8న ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నీటి వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో డ్యామ్ గేట్లను అధికారులు విప్పారు. అయితే వరద ఉధృతి గత నాలుగు రోజులుగా క్రమంగా తగ్గడంతో ఇప్పుడు అధికారులు మళ్లీ గేట్లను మూసివేశారు. ఈ పరిణామాలన్నీ శ్రీశైలం జలాశయ పరిస్థితిపై స్పష్టతనిచ్చే అంశాలు కాగా, వరద ఉధృతిని నియంత్రించేందుకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.