Page Loader
ఉత్తర్‌ప్రదేశ్‌‌లో ముస్లిం దంపతుల దారుణ హత్య 
ఉత్తర్‌ప్రదేశ్‌‌లో ముస్లిం దంపతుల దారుణ హత్య

ఉత్తర్‌ప్రదేశ్‌‌లో ముస్లిం దంపతుల దారుణ హత్య 

వ్రాసిన వారు Stalin
Aug 20, 2023
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌‌ సీతాపూర్ జిల్లాలో ముస్లిం దంపతులను కొందరు దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్‌లు, కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముస్లిం దంపతుల కుమారుడి ప్రేమ వ్యవహారమే ఈ జంట హత్యలకు కారణంగా తెలుస్తోంది. మృతి చెందిన వారి పేర్లను అబ్బాస్, అతని భార్య కమ్రుల్ నిసాగా పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన తర్వాత నిందితులు పారిపోయినట్లు, ప్రస్తుతం ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సీతాపూర్‌ ఎస్పీ చక్రేష్ మిశ్రా వివరాలను వెల్లడించారు.

యూపీ

పక్కా ప్లాన్ ప్రకారమే అబ్బాస్ ఇంటిపై దాడి

కొన్ని సంవత్సరాల క్రితం అబ్బాస్ కొడుకు పక్కంటి హిందూ అమ్మాయిని ప్రేమించాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి పారిపోయారు. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అబ్బాస్‌ కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత శిక్ష పూర్తయ్యాక అబ్బాస్ కొడుకు ఇటీవల విడుదలయ్యాడు. ఈ క్రమంలో తమ కుమార్తెతో పారిపోయాడనే కోపంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాస్ కుటుంబంపై దాడికి పథకం వేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్సా‌స్ ఇంటిపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసి భార్య, భర్తలను దారుణంగా కొట్టి చంపారు. ఈ జంట హత్యలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి, నేరానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.