తదుపరి వార్తా కథనం

S Jaishankar: చరిత్రలో మొదటిసారి.. తాలిబన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ కీలక చర్చలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 16, 2025
08:55 am
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో ఓ కీలక పరిణామం నమోదైంది. అఫ్గానిస్థాన్లో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఫోన్ ద్వారా మాట్లాడారు. ఇటీవల పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిని తాలిబన్ ఖండించిన నేపథ్యంలో ఈ ప్రకటనకు జైశంకర్ స్వాగతం తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారం కేంద్ర మంత్రి జైశంకర్ 'ఎక్స్' (మాజీ ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. తాలిబన్ ప్రభుత్వంతో న్యూదిల్లీ మంత్రిత్వ స్థాయిలో చర్చలు జరపడం ఇదే తొలిసారి కావడం విశేషం.