
Kerala: కేరళలో ఫుట్బాల్ ఆటగాడిపై దాడి.. కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఫుట్బాల్ టోర్నమెంట్లో ఐవరీ కోస్ట్కు చెందిన దైర్రాసౌబా హస్సేన్ జూనియర్ అనే ఫుట్బాల్ క్రీడాకారుడిపై ప్రేక్షకులు దాడి చేసి చితకబాదారు.
దాడి తరువాత, హస్సేన్ జూనియర్ మలప్పురం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)కి ఫిర్యాదు చేశాడు.
సాక్ష్యం కోసం వీడియో ఫుటేజీని సమర్పించారు. ఫిర్యాదు ప్రకారం, మ్యాచ్లో ప్రేక్షకులు హస్సేన్ పై జాతి దూషణలు చెయ్యడమే కాకుండా, రాళ్లు కూడా రువ్వారు.
మైదానం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, మైదానంలోని పలు ప్రాంతాల్లో ప్రేక్షకులు హస్సేన్ ను వెంబడించి దాడి చేశారు.
మలప్పురం పోలీస్ చీఫ్ ఆదేశాల మేరకు ఫిర్యాదు ప్రస్తుతం అరీకోడ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) విచారణలో ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
A football player from West Africa, Ivory Coast was attacked by a mob in Mallapuram, Kerala. The mob hurled racial abused, called him 'African monk*y, black cat... .
— Vipul | विपुल (@vipulizm) March 13, 2024
High literacy rate did no good. Something is seriously wrong with India, mob mentality is one of them. pic.twitter.com/vHh50wqLg4