Illegal mining: మైనింగ్ కేసులో ఐఎన్ఎల్డీ మాజీ ఎమ్మెల్యే,సహచరుల ప్రాంగణంలో ఈడీ దాడులు
హర్యానా ఐఎన్ఎల్డీ మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్,అతని సహచరుల ప్రాంగణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో విదేశాలలో తయారైన ఆయుధాలు, సుమారు 300 కాట్రిడ్జ్లు,రూ.5 కోట్ల నగదు,100కు పైగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక వర్గాలు శుక్రవారం తెలిపాయి. యమునానగర్,సోనిపట్,మొహాలీ, ఫరీదాబాద్,చండీగఢ్, కర్నాల్లలోని ఇద్దరు రాజకీయ నాయకులు,అనుబంధ సంస్థలకు చెందిన సుమారు 20 ప్లేస్ లలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ప్రకారం నిర్వహించిన దాడులలో వీటిని స్వాధీనం చేసుకున్నారు. లీజు గడువు ముగిసిన తర్వాత కూడా యమునానగర్, సమీప జిల్లాల్లో గతంలో జరిగిన బండరాళ్లు, కంకర,ఇసుక అక్రమ మైనింగ్పై దర్యాప్తు చేయడానికి హర్యానా పోలీసులు నమోదు చేసిన అనేక ఎఫ్ఐఆర్ల నుండి మనీలాండరింగ్ కేసు వచ్చింది.
ఆన్లైన్ పోర్టల్ 'ఈ-రావణ'పై కేంద్ర ఏజెన్సీ విచారణ
రాయల్టీలు,పన్నుల సేకరణను సులభతరం చేయడానికి మైనింగ్ ప్రాంతాలలో పన్ను ఎగవేతను నిరోధించడానికి 2020లో హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ పోర్టల్ 'ఈ-రావణ' పథకంలో జరిగిన మోసం గురించి కూడా కేంద్ర ఏజెన్సీ విచారణ చేస్తోంది.