NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka: కర్ణాటకలో దారుణం.. మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ హత్య.. భార్యే హంతకురాలు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Karnataka: కర్ణాటకలో దారుణం.. మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ హత్య.. భార్యే హంతకురాలు!

    Karnataka: కర్ణాటకలో దారుణం.. మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ హత్య.. భార్యే హంతకురాలు!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 21, 2025
    08:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక రాష్ట్రానికి మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా సేవలందించిన ఓం ప్రకాశ్‌ (వయస్సు 68) దారుణ హత్యకు గురయ్యారు.

    ఈ ఘటనకు కారణం కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలేనని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.

    ఈ కేసులో ఓం ప్రకాశ్‌ భార్య పల్లవి ప్రధాన నిందితురాలిగా భావిస్తున్నారు.

    ఓం ప్రకాశ్‌ 1981 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన బిహార్‌ రాష్ట్రంలోని చంపారన్‌ ప్రాంతానికి చెందినవారు.

    2015 మార్చి 1న కర్ణాటక రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించి, 2017లో పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ అనంతరం బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో నివసిస్తున్నారు.

    వివరాలు 

    ఓం ప్రకాశ్‌, భార్య పల్లవి మధ్య ఆస్తి సంబంధిత వివాదాలు

    ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఓం ప్రకాశ్‌ భార్య పల్లవి పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతని నివాసానికి వెళ్లారు.

    ఇంట్లో రక్తపు మడుగులో పడివున్న ఓం ప్రకాశ్‌ను గుర్తించిన వారు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

    అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

    ఇటీవలి కాలంలో ఓం ప్రకాశ్‌, ఆయన భార్య పల్లవి మధ్య ఆస్తి సంబంధిత వివాదాలు ఎక్కువయ్యాయి.

    ఇతర కుటుంబ సభ్యుల మధ్యనూ విభేదాలు తలెత్తాయి. కొద్ది రోజుల క్రితం ఓం ప్రకాశ్‌ ఇంటి వద్ద పల్లవి ఆందోళనకు దిగిన సంఘటన మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

    వివరాలు 

    పోలీసుల అదుపులో మృతుడి భార్య పల్లవి, కుమార్తె, కోడళ్ళు 

    పల్లవి 'ఐపీఎస్‌ ఫ్యామిలీ గ్రూప్‌'లో తన భర్త ఓం ప్రకాశ్‌ తరచూ కుటుంబాన్ని వేధిస్తున్నారని, తుపాకీతో ఇంట్లో తిరుగుతూ భయాందోళనలు కలిగిస్తున్నారని మెసేజ్‌లు పంపినట్లు పోలీసులు తెలిపారు.

    ఆదివారం ఉదయం ఉదయం ఘర్షణ తీవ్ర స్థాయికి చేరడంతో పల్లవి ఓం ప్రకాశ్‌ను పలుమార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

    హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ఆమె "ఐ హ్యావ్‌ ఫినిష్డ్‌ మాన్‌స్టర్‌" అనే సందేశాన్ని పంపినట్టు తెలిపారు.

    ఈ సంఘటనపై డీజీపీ అలోక్‌ మోహన్‌, బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ బి. దయానంద్‌ హత్య స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.

    ప్రస్తుతం మృతుడి భార్య పల్లవి, కుమార్తె, కోడళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం

    కర్ణాటక

    Hyderabad: గాడిద పాల పేరిట కుంభకోణం.. రూ.100 కోట్లు నష్టపోయిన బాధితులు తెలంగాణ
    Prajwal Shetty: కాంగ్రెస్ నేత కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. ఒకరు దుర్మరణం కాంగ్రెస్
    Gokarna: గోకర్ణ పరిసర ప్రాంతాల్లో మిస్ కాకుండా చూడాల్సినవి ఇవే..! లైఫ్-స్టైల్
    Karnataka: క‌ర్ణాట‌క మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ క‌న్నుమూత‌ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025